Writer Vijayendra Prasad: ప్రముఖ సినీ రచయిత, రాజ్యసభ ఎంపీ విజయేంద్ర ప్రసాద్ చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ప్రస్తుతం సామాజిక వర్గాల్లో విస్తృత చర్చకు దారి తీస్తున్నాయి. మంగళవారం (ఫిబ్రవరి 17) రాత్రి హైదరాబాద్లోని రవీంద్రభారతిలో మాతా రాంబాయి అంబేడ్కర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మాతా రాంబాయి అంబేడ్కర్ స్మారక పురస్కారాల ప్రదానోత్సవంలో ఆయన పాల్గొని భావోద్వేగంగా ప్రసంగించారు.
Read Also: Bomb Threat: కరీంనగర్, నాంపల్లి కోర్టులకు బాంబు బెదిరింపులు
తమ పూర్వీకులు సంపన్న కుటుంబానికి చెందిన వారని.. వారు అంటరానితనం పేరుతో నోటితో చెప్పటానికి వీల్లేని భయంకరమైన దారుణాలు చేశారన్నారు. అయితే తనకు తెలిసీ ఎప్పుడూ తప్పు చేయాలేదని వ్యాఖ్యనించారు. అప్పటి పరిస్థితులను తలుచుకుంటే మనసు సిగ్గుతో చచ్చిపోతుందని.. అవమానంతో కుంగిపోతుందని.. అందరికీ తలవంచి నమస్కరిస్తున్నానని అన్నారు. తమ పూర్వీకులు చేసిన తప్పుకు క్షమించాలని వేడుకున్నారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్పై ఒక సినిమా కథ రాస్తున్నా
అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ప్రస్తుతం తన కార్యాలయంలో మహనీయుడు అంబేడ్కర్ చిత్రం మాత్రమే ఉంటుందని చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్పై ఒక సినిమా కథ రాస్తున్నానని.. ప్రస్తుతం దానిపై పరిశోధన చేస్తున్నాట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ పాట పాడి సభకు వచ్చిన వారిని ఉత్సాహపరిచారు. ‘పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలామా.. పోరు తెలంగాణమా’ అంటూ ఆయన ప్రజా యుద్ధ నౌక గద్దర్ పాటను పాడారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: