తెలంగాణ రాష్ట్రంలో పండగల సందర్భంలో మద్యం, మాంసాహారం ప్రత్యేక స్థానం పొందినవిగా ఉన్నాయి. పండగ, పెళ్లి, పబ్బం, చావు వంటి ప్రతి సందర్భంలో తప్పకుండా ఉండాల్సిందే.. ముఖ్యంగా దసరా (Dussehra) వంటి పెద్ద పండగలో మాంసాహారం,మద్యం వినియోగం సాధారణ కంటే ఎక్కువగా ఉంటుంది. అయితే ఈసారి దసరా నాడు మాత్రం ఆ అవకాశం లేదు.
Telugu States Weather: తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు
ఎందుకంటే దసరా పండగ.. గాంధీ జయంతి (Gandhi Jayanti) అయిన అక్టోబర్ 2న వస్తుంది. దీంతో ఆరోజు మద్యం, మాసం దుకాణాలు బంద్ ఉంటాయి. దీనిపై ఇప్పటికే జీహెచ్ఎంసీ (GHMC) ప్రకటన కూడా చేసింది. మరి పండగ పూట చుక్క లేకపోతే ఎలా.. అందుకే మందు బాబులు ముందస్తు కొనగోళ్లు మొదలు పెట్టారు. దీంతో ఒక్క రోజులోనే 279 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.
దసరా పండుగ నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. అయితే ఈసారి పండగకు రెండు, మూడు రోజుల ముందు నుంచే లిక్కర్ (Liquor) అమ్మకాలు ఊపందుకున్నాయి. ఎందుకంటే ఈ సంవత్సరం దసరా పండగ గాంధీ జయంతి రోజున వచ్చింది. దీంతో దసరా పండగ అయిన అక్టోబర్ 2న మద్యం, మాంసం దుకాణాలు బంద్.
పండగకు రెండు రోజుల ముందు నుంచే మద్యం కొనుగోళ్లు
మరి మందు బాబులు ఊరుకుంటారా.. పండగకు రెండు రోజుల ముందు నుంచే మద్యం కొనుగోళ్లు మొదలుపెట్టారు. దీంతో సెప్టెంర్ 29న ఒక్క రోజులోనే రూ. 278 కోట్ల 66 లక్షల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. అక్టోబర్ 1, బుధవారం నాడు డిమాండ్ అధికంగా ఉంటుందని భావిస్తోన్న వైన్ షాపు యజమానులు.. డిపో (Depo)ల నుంచి పెద్ద ఎత్తున మద్యం తరలిస్తున్నారు.

సెప్టెంబర్ 30, మంగళవారం నాడు కూడా మద్యం అమ్మకాలు భారీ ఎత్తున సాగాయని.. ఎక్సైజ్ శాఖ వర్గాలు వెల్లడించారు.మంగళవారం నాడు ఏకంగా రూ.300 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు (Liquor sales) జరిగినట్లు సమాచారం. ఇక బుధవారం నాడు రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జోరందుకుంటాయని..
లిక్కర్ సేల్స్ జరుగుతాయని ఎక్సైజ్ శాఖ
ఈ రోజు కూడా 300 కోట్ల రూపాయలకు పైగా లిక్కర్ సేల్స్ జరుగుతాయని ఎక్సైజ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అలానే అక్టోబర్ 3న కూడా మద్యం అమ్మకాలు పెద్ద స్థాయిలో జరుగుతాయని అంటున్నారు.
వరుస సెలువులు రావడం.. దీనికి తోడు స్థానిక ఎన్నికల సంస్థల ఎన్నిక నగరా మోగడంతో.. రాష్ట్రంలో భారీగా మద్యం అమ్మకాలు నమోదవుతాయంటున్నారు ఎక్సైజ్ అధికారులు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: