Breaking News – Bandi Sanjay : బకాయిలు అడిగితే బ్లాక్మెయిల్ చేస్తారా.. ప్రభుత్వంపై బండి ఫైర్

Read Time:  1 min
News Telugu
News Telugu
FONT SIZE
GET APP

తెలంగాణలో విద్యా సంస్థలపై జరుగుతున్న విజిలెన్స్ దాడులు రాజకీయ ప్రేరణతో జరుగుతున్నాయా అనే ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా నిలదీశారు. ఫీజు బకాయిలు అడిగిన విద్యాసంస్థలను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారా అని ప్రశ్నించారు. విద్యార్థుల ఫీజు బకాయిలను విడుదల చేయాల్సిన సమయంలో ప్రభుత్వం విజిలెన్స్ దాడులతో బ్లాక్మెయిల్ చేయడం తగదని వ్యాఖ్యానించారు. బిహార్ ఎన్నికలకు ఇక్కడి నుంచి డబ్బులు పంపే ప్రభుత్వం, రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తు గురించి మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు.

Breaking News – Jubilee Hills Bypoll : బిగ్ ట్విస్ట్.. హోల్డ్ లో నవీన్ యాదవ్ నామినేషన్!

బండి సంజయ్ మాట్లాడుతూ, విద్యా రంగం రాష్ట్ర అభివృద్ధికి మూలస్తంభమని గుర్తుచేశారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు వేలాది మంది ఉపాధ్యాయులు, సిబ్బందికి జీవనాధారం అని అన్నారు. అలాంటి సంస్థలపై ప్రతీకార చర్యలతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తే, చివరికి దెబ్బ తినేది విద్యార్థుల భవిష్యత్తేనని హెచ్చరించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ఉన్న బాధ్యతను గుర్తించి, విద్యా రంగాన్ని రాజకీయాల వేదికగా మార్చొద్దని సూచించారు.

అలాగే విద్యా సంస్థలకు బండి సంజయ్ భరోసా ఇచ్చారు. ప్రభుత్వం చేసే బెదిరింపులకు, దౌర్జన్యాలకు భయపడొద్దని, తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. విద్యార్థుల ప్రయోజనాల కోసం అవసరమైతే కేంద్ర స్థాయిలో కూడా ఈ విషయం లేవనెత్తుతానని చెప్పారు. తెలంగాణలో విద్యార్థుల భవిష్యత్తు కాపాడటమే తమ ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో చర్చ చెలరేగింది. ప్రభుత్వ వైఖరిపై ఇప్పుడు ప్రతిపక్షం దూకుడు పెంచింది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

.

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.