Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? కవిత ఏమన్నారంటే..

Read Time:  1 min
Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? కవిత ఏమన్నారంటే..
FONT SIZE
GET APP

తెలంగాణలోని ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) కొత్త మలుపు తిరిగింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈ కేసులో కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు దగ్గరగా ఉన్నవారికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) నోటీసులు జారీచేసిందని ఆమె తెలిపారు. ఈ కేసు వెనుక రాజకీయ లక్ష్యాలే ఉన్నాయంటూ ఆమె సూచించారు. నిష్పాక్షిక దర్యాప్తు జరగాలని కోరుతూ, ప్రభుత్వ యంత్రాంగాన్ని సద్వినియోగం చేసుకోవద్దని ఆమె వ్యాఖ్యానించారు.

“కేసీఆర్ గారు ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోరు”

కవిత (Kavitha) మాట్లాడుతూ, “కేసీఆర్ గారు భోళాశంకరుడిలా ఉంటారు. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో జోక్యం చేసుకొని తన స్థాయిని దిగజార్చుకునే వ్యక్తి కాదని” పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేసీఆర్ త‌న కుటుంబసభ్యుల ఫోన్లు ట్యాప్ చేయించారంటూ వచ్చిన ఆరోపణలు బాధాకరమని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా తమ ఫోన్లు ట్యాప్ చేయడం అనేది సరికాదని ఆమె వ్యాఖ్యానించారు.

“సత్యాన్ని సమయం వెల్లడిస్తుంది”

“కిందివాళ్లు ఏమైనా తప్పు చేశారు? లేదా? అనేది సమయమే నిరూపిస్తుంది. కానీ కేసీఆర్ గారిపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవే,” అని కవిత స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ కేసును ఊదరగొడుతున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారంపై నిజాలు వెలుగులోకి రావాలని, విచారణ పక్షపాతం లేకుండా జరగాలని ఆమె కోరారు. ఈ వ్యాఖ్యలతో మరోసారి ఫోన్ ట్యాపింగ్ కేసు చర్చనీయాంశంగా మారింది.

Read Also : Online betting : బెట్టింగ్ వ్యసనం : కన్నతండ్రినే కడతేర్చిన కొడుకు!

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.