Wedding Tragedy: కుమార్తె అప్పగింతల వేళ వేదనతో ఆగిన తల్లి గుండె

Read Time:  1 min
Wedding Tragedy
Wedding Tragedy
FONT SIZE
GET APP

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆనంద వాతావరణం నిండిన పెళ్లి ఇంట్లో ఒక్కసారిగా విషాదం నెలకొంది. కూతురి పెళ్లి ఘనంగా జరిపిన తల్లి, అప్పగింతల కార్యక్రమంలో హఠాత్తుగా కుప్పకూలి ప్రాణాలు విడవడం కుటుంబ సభ్యులను, బంధువులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

కూతురి వివాహం తర్వాత తల్లి మృతి

కామేపురం మండలం అబ్బాసుపురం తండా (Abbasupuram Thanda)కు చెందిన బానోతు మోహన్‌లాల్, కల్యాణి దంపతుల పెద్ద కుమార్తె సింధు వివాహం ఆదివారం జరిగింది. టేకులపల్లి మండలం కొత్తతండాకు చెందిన వరుడితో సింధు పెళ్లి ఘనంగా పూర్తయింది. వివాహ వేడుకల్లో ఆనందోత్సాహం నిండిన ఇంట్లో అప్పగింతల కార్యక్రమంలోనే విషాదం చోటు చేసుకుంది.

Wedding Tragedy
Wedding Tragedy

అప్పగింతల వేడుకలో కన్నీరు

కూతురిని అత్తారింటికి పంపించే (Sending a daughter to aunt’s house)సమయంలో తల్లి కల్యాణి తీవ్ర భావోద్వేగానికి గురయ్యింది. కుమార్తెతో విడిపోవాల్సి రావడం తట్టుకోలేకపోయింది. ఈ క్రమంలో హఠాత్తుగా కుప్పకూలిపోయి అక్కడికక్కడే మృతి చెందింది. ఒక్క క్షణంలో ఆనందం కన్నీటిగా మారింది.

నవవధువు విలపించిన తీరు

తల్లి మృతితో పెళ్లి ఇంట్లో ఆనందం నిండిన వాతావరణం ఒక్కసారిగా విషాదంగా మారింది. కొత్త వధువు తల్లి మృతితో విలపించిన తీరు బంధువులను, స్నేహితులను, స్థానికులను కళ్లపట్టింది. ఈ ఘటనతో అబ్బాసుపురం తండా, కొత్తతండాలో విషాదం అలుముకుంది. ఆనందంతో జరిపిన పెళ్లి వేడుక ఒక్కసారిగా శోకసంద్రంగా మారడం గ్రామస్తులను కుదిపేసింది. బంధువులు, స్థానికులు కుటుంబానికి పరామర్శలు తెలుపుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/basheerabad-surrogacy-case-pet-basheerabad-surrogacy-case-a-sensation/telangana/531820/

Sharanya

రచయిత గురించి

Sharanya

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.