📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Weather Updates: ఆ 22 జిల్లాలకు హెచ్చరిక.. మరో 3 రోజులు కుండపోత వర్షాలు!

Author Icon By vishnuSeo
Updated: April 3, 2025 • 11:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మూడు రోజుల పాటు భారీ వర్షాలు

ఉపరితల ఆవర్తనం ప్రభావం
తెలంగాణ రాష్ట్రంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు, వడగళ్లతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయని హెచ్చరించారు. ఆ 22 జిల్లాలకు హెచ్చరిక ఉపరితల ఆవర్తనం మరాఠ్వాడా, దానిని ఆనుకుని ఉన్న మధ్య మహారాష్ట్ర ప్రాంతంలో సగటు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడింది. తూర్పు గాలులలో ద్రోణి ఈ రోజు దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి ఉపరితల ఆవర్తనం మీదుగా నైరుతి మధ్యప్రదేశ్‌ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడింది. ఉత్తరాంధ్ర తీరం, దానికి సమీప ప్రాంతాల్లో మరో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడింది. వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Weather Updates: 22 జిల్లాలకు వాతావరణ హెచ్చరిక
తాజా వాతావరణ నివేదిక ప్రకారం, తెలంగాణలో 22 జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలకు ఆ 22 జిల్లాలకు హెచ్చరిక ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎలో అలర్ట్ ప్రకటించారు. ప్రజలు అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు వెళ్లరాదని సూచించారు. ఈ రోజు ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట్, మహబూబ్ నగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే, శుక్రవారం నాటికి మొత్తం 22 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు తెలిపారు.

Weather Updates: పిడుగుల ప్రమాదం – రైతులకు సూచనలు
వ్యవసాయ పనుల నిమిత్తం పొలాలకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని, పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున కరెంట్ పోళాలకు దూరంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. అదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, మహబూబ్ నగర్ సహా 22 జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా, ఆ 22 జిల్లాలకు హెచ్చరిక జారీ చేయబడింది. వ్యవసాయ పనుల నిమిత్తం పొలాలకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని, పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున కరెంట్ పోస్ట్‌లకు దూరంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు.

హైదరాబాద్‌లో ట్రాఫిక్ జామ్ – వరద నీటితో జనజీవనం అస్తవ్యస్తం
హైదరాబాద్‌లో గురువారం కురిసిన భారీ వర్షంతో రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. వర్షపు ప్రభావంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు చోట్ల చెట్లు కూలిపోయాయి. నగరంలో మరో మూడు రోజుల పాటు వర్షం పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఆ 22 జిల్లాలకు హెచ్చరిక అందించినట్లు వారు వివరించారు. ఇక హైదరాబాద్‌కు కూడా ఎల్లో అలర్ట్ ప్రకటించారు. వర్ష పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, అవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు ప్రజలకు సూచించారు.

Breaking News in Telugu Google News in Telugu Heavy Rains Latest News in Telugu rain alert Telangana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.