తెలంగాణ రాష్ట్రంలో అందరికీ స్వగృహం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Houses) పథకాన్ని ప్రారంభించింది. అయితే ఈ పథకం ప్రయోజనం అనర్హులకు అందకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ – “అర్హత లేని వారికి ఇళ్లు మంజూరు చేస్తే తక్షణమే రద్దు చేస్తాం. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు అందేలా చర్యలు తీసుకుంటాం” అని అన్నారు.
ఐదేళ్లలో 20 లక్షల ఇళ్లు లక్ష్యం
ఇదే సందర్భంలో మంత్రి పొంగులేటి, రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన లక్ష్యం ఐదేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి పంపిణీ చేయడం అని ప్రకటించారు. ఈ పథకంతో తెలంగాణలో నిరాశ్రయుల సమస్యను పూర్తిగా పరిష్కరించడమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లో సమన్వయంతో ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.
ప్రజల ఆత్మగౌరవమే ప్రభుత్వ లక్ష్యం
తెలంగాణలో ప్రజల ఆత్మగౌరవం, అభివృద్ధి, సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలిపారు. గత పదేళ్ల పాలనలో నిర్వర్తించని విధులను ప్రజా ప్రభుత్వం వేగంగా పూర్తి చేస్తోందన్నారు. భవన నిర్మాణాలతో పాటు విద్య, వైద్యం, సాగు, ఉద్యోగాల పంపిణీ వంటి రంగాల్లో కూడా సమగ్ర అభివృద్ధి జరగనుందని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. ప్రజల మద్దతుతో ప్రజల కోసం పని చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Read Also : Donald Trump : ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధాన్ని ఆపుతా : ట్రంప్