తెలంగాణ ప్రభుత్వం పునరుద్ధరించిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్ట్ (Pranahitha Chevella) పై కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తాజా ప్రకటన ప్రకారం, ఈ ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం ఖాయం అని స్పష్టం చేశారు. ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర ఉత్తర తెలంగాణ ప్రాంతాలకు శాశ్వత నీటి భద్రత కల్పించేందుకు కీలకం అవుతుంది.” మంత్రి ఉత్తమ్ వివరిస్తూ, ప్రస్తుతం రెండు విభిన్న అలైన్మెంట్లు పరిశీలనలో ఉన్నాయని, వాటిలో ఒకదాన్ని*ఈనెల 22వ తేదీ నాటికి ఖరారు చేస్తామని చెప్పారు.
CM Revanth : సీనియర్ నేతలతో సీఎం రేవంత్ సుదీర్ఘ చర్చ
మొదటి అలైన్మెంట్ ప్రకారం..తుమ్మిడిహెట్టి నుండి మైలారం వరకు 71.5 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ నిర్మించి, ఆపై 14 కిలోమీటర్ల టన్నెల్ ద్వారా సుందిళ్ల రిజర్వాయర్కు నీరు తరలించే ప్రణాళిక ఉంది. ఈ మార్గంలో గురుత్వాకర్షణ శక్తితోనే నీటి ప్రవాహం కొనసాగుతుందని, దీని వల్ల విద్యుత్ వ్యయం తగ్గి, దీర్ఘకాలికంగా నీటి సరఫరా సుస్థిరంగా ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రెండవ అలైన్మెంట్లో అయితే పంపింగ్ స్టేషన్ ద్వారా తుమ్మిడిహెట్టి నుండి నేరుగా ఎల్లంపల్లి రిజర్వాయర్కు నీటిని తరలించే ఆలోచన ఉన్నట్లు మంత్రి వివరించారు. ఈ విధానంలో నీటి పంపింగ్ ఖర్చు పెరిగినా, సాంకేతికంగా వేగవంతమైన నీటి సరఫరా సాధ్యమవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్ట్ తెలంగాణ రైతులకు జీవనాధారం అవుతుంది అని మంత్రి పేరొన్నారు. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, నిజాంసాగర్ పరిధిలోని లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే మా లక్ష్యం.” ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే నీటి కొరత సమస్య మాత్రమే కాదు, ఆ ప్రాంతాల్లో ఆర్థిక, వ్యవసాయాభివృద్ధి కొత్త దశలోకి ప్రవేశిస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. ప్రభుత్వం త్వరలో ప్రాజెక్ట్ రూపకల్పన, బడ్జెట్ కేటాయింపు, టెండర్ల ప్రక్రియలను వేగవంతం చేయనున్నట్లు వెల్లడించారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/