వరంగల్ క్రైం: వరంగల్ మత్స్యశాఖ కార్యాలయంలో ఓ సొసైటీ నుంచి ₹75 వేలు లంచం తీసుకుంటూ జిల్లా అధికారిణి సహా ఫీల్డ్ ఆఫీసర్ పట్టుబడ్డారు. జిల్లా అధికారిణి నాగమణి ఆదేశాల మేరకు లంచం డిమాండ్ చేసిన ఫీల్డ్ ఆఫీసర్ హరీష్ను ఏసీబీ (Anti-Corruption Bureau) అధికారులు రెడ్ హ్యాండెడ్గా అదుపులోకి తీసుకున్నారు.
Read also: Atchannaidu: శనగ రైతును ఆదుకుంటాం
సొసైటీ అనుమతి కోసం లంచం డిమాండ్
సొసైటీకి(society) అనుమతి ఇవ్వకుండా కాలయాపన చేసిన అధికారులు, ఆ అనుమతికి సంబంధించి డబ్బులు డిమాండ్ చేశారని బాధితులు తెలిపారు. ఫీల్డ్ ఆఫీసర్ హరీష్, జిల్లా అధికారిణి నాగమణికి విషయం చెప్పి వారి ఆదేశాల మేరకే డబ్బులు తీసుకుంటున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. వరంగల్(Warangal) ఎసిబి వలలో వరంగల్ మత్స్యశాఖ అధికారులు మత్స్యశాఖ కార్యాలయంలో ప్రతీ పనికి లంచం ఇవ్వనిదే పనులు ముందుకు జరగవని బాధితులు ఆరోపిస్తున్నారు.
వరంగల్ మత్స్యశాఖ కార్యాలయంలో ఏ అధికారులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు?
జిల్లా అధికారిణి (నాగమణి) మరియు ఫీల్డ్ ఆఫీసర్ (హరీష్) లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.
ఎంత మొత్తంలో లంచం తీసుకున్నారు?
ఒక సొసైటీ నుంచి ₹75 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also: