- అన్ని శాఖలలో విప్లవాత్మక అభివృద్ధి
- జిల్లా ని అన్ని రంగాల్లో ముందుంచాలి
- మంత్రి వివేక్ వెంకట స్వామి
మెదక్:
ప్రజా సంక్షేమము కోసమే ప్రజా పాలన అందిస్తున్నాం అని జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. బుధవారం మెదక్ జిల్లా సమీకృత కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా పాలన దినోత్సవం కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించామని అన్నారు. అనంతరం వివిధ రంగాల్లో మెదక్ జిల్లా ప్రగతి నివేదికను తెలిపారు. మహాలక్ష్మి పథకం తో జిల్లాలో ఇప్పటి వరకు 3 కోట్ల 55 లక్షల సార్లు మహిళలు ఉచిత రవాణా సౌకర్యం(Free Bus) వినియోగించుకున్నారు అని దీని ద్వారా మహిళకు 87 కోట్ల 81 లక్షల లబ్ధి జరిగిందన్నారు. గృహ జ్యోతి పథకం ద్వారా లక్ష 27 వేల 381 విద్యుత్ వినియోగ దారులకు 200 యూనిట్ల లోపూ ఉచిత విద్యుత్ బిల్లు అందించి మందిమంది 69 కోట్ల 19 లక్షల సబ్సిడీ అందించడం జరిగిందన్నారు.
వ్యవసాయ శాఖ
రైతు భరోసా:
వానకాలం 2025 సీజన్కు గాను మొత్తం 2,62,043 మంది రైతుల ఖాతాల్లో 220 కోట్ల 84 లక్షల రూపాయలు అంచనా వేసి జమ చేయడం జరిగింది.
రైతు రుణమాఫీ:
మేడక్ జిల్లాలో రైతు రుణమాఫీ పధకం ద్వారా ఇప్పటి వరకు మొత్తం 87 వేల 491 మంది రైతులకు 645 కోట్ల 41 లక్షల రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది.
వైద్య మరియు ఆరోగ్య శాఖ
రాజీవ్ ఆరోగ్యశ్రీ:
రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య పధకానికి 10 లక్షల రూపాయలకు పెంచడం ద్వారా జిల్లాలో 25 వేల 826 మంది పేరు చికిత్సలు పొందగా, అందుకు గాను ప్రభుత్వం 68 కోట్ల 84 లక్షల రూపాయలు ఖర్చు చేసింది.
జిల్లాలో కొత్త మెడికల్ కాలేజి మరియు నర్సింగ్ కాలేజీలను(Nursing colleges) ప్రారంభించడం జరిగింది. కొత్త మెడికల్ కాలేజి బిల్డింగ్కు 180 కోట్ల రూపాయలు మరియు నర్సింగ్ కాలేజి బిల్డింగ్కు 26 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది.
పౌర సరఫరా శాఖ
500 రూపాయలకే పంట గ్యాస్:
ఈ పధకం ద్వారా మేడక్ జిల్లాలో ఇప్పటివరకు 1 లక్ష 26 వేల 796 మంది వినియోగదారులకు 4 లక్షల 68 వేల 195 గ్యాస్ సిలిండర్లు 500 రూపాయలకే పంచి ఇవ్వడం జరిగింది. దీని కోసం ప్రభుత్వం 13 కోట్ల 18 లక్షల రూపాయలు సబ్సిడీ అందించింది.
ప్రజా పంచాయితీ వ్యవస్థ ద్వారా జిల్లాలో 2 లక్షల 32 వేల 579 కుటుంబాలకు చౌక ధర దుకాణాల ద్వారా సెప్టెంబర్ 2025 మాసానికి గాను 4 వేల 850 మెట్రిక్ టన్నుల సరకు పంపిణీ చేయడం జరిగిందన్నదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అడిసినల్ కలెక్టర్ నగేష్ గౌడ్, మ్మెల్యే మైనం పల్లి రోహిత్, ఎస్పీ శ్రీనివాస్ రావు లతో పాటు అన్ని శాఖ ల అధికారులు పాల్గొన్నారు.
ప్రజా పాలన దినోత్సవం ఎక్కడ జరిగింది?
మెదక్ జిల్లా సమీకృత కలెక్టరేట్ లో జరిగింది.
మహాలక్ష్మి పథకం ద్వారా ఎంత లాభం కలిగింది?
3 కోట్ల 55 లక్షల సార్లు మహిళలు ఉచిత రవాణా వినియోగించుకుని, 87 కోట్ల 81 లక్షల లబ్ధి పొందారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: