📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

వికారాబాద్ ఘటన..కొనసాగుతున్న అరెస్టులు..!

Author Icon By sumalatha chinthakayala
Updated: November 16, 2024 • 11:21 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వికారాబాద్ : లగచర్ల కలెక్టర్‌, అధికారుల పై దాడి ఘటనలో ఇంకా అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో అనేక మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తాజాగా మరికొందరిని కూడా అరెస్ట్ చేశారు. ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని కొడంగల్ పోలీస్‌స్టేషన్‌ నుంచి పరిగి పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. వీరందరినీ సాయంత్రం వరకు రిమాండ్ చేసే అవకాశం ఉంది. అలాగే ఈ కేసులో మరికొందరి కోసం కూడా పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

కాగా.. వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ నియోజకవర్గం పరిధిలోని దుద్యాల మండలం, లగచర్ల గ్రామంలో ఫార్మా ఇండస్ట్రియల్‌ కారిడార్‌ (క్లస్టర్‌) ఏర్పాటుకు భూసేకరణలో భాగంగా ఈనెల 11న ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు వచ్చిన జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌, అదనపు కలెక్టర్‌ లింగ్యానాయక్‌, తాండూరు సబ్‌-కలెక్టర్‌ ఉమాశంకర్‌ ప్రసాద్‌, కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, తహసీల్దార్‌ విజయకుమార్‌, వికారాబాద్‌ డీఎస్పీ శ్రీనివాస్‌ రెడ్డిపై రైతులు, గ్రామస్థులు రాళ్లు, కర్రలతో దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సీరియస్‌ తీసుకున్న పోలీసులు.. దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోల ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు.. లగచర్ల దాడిలో పోలీసులు మొత్తం 47 మంది నిందితులను గుర్తించగా.. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, మరో 21 మందిని రిమాండ్‌ చేశారు.

దాడిలో కీలకంగా వ్యవహరించిన సురేశ్‌రాజ్‌, దేవదాస్‌, గోపాల్‌నాయక్‌, విజయ్‌, విఠల్‌ పరారీలో ఉన్నారు. వీరిని అరెస్టు చేసేందుకు నాలుగు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. అరెస్ట్‌ల నేపథ్యంలో ఆ మూడు గ్రామాల్లో నిశబ్ధ వాతావరణం చోటు చేసుకుంది. ఈ దాడిలో సురేష్ ప్రధాన సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. సురేశ్‌ బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడని, దాడికి ముందు.. ఆ తర్వాత కూడా అతడి ఫోన్‌ నుంచి కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో 42 సార్లు మాట్లాడినట్లు కాల్‌డేటా రికార్డ్‌ (సీడీఆర్‌) ద్వారా గుర్తించారు. సురేశ్‌ తనకు ఫోన్‌ చేసిన విషయం వాస్తవమేనని, భూసేకరణకు వచ్చిన అధికారులతో శాంతంగా మాట్లాడాలని సూచించినట్లు నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ కేసుకు సంబంధించి పట్నం నరేందర్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

arrests Kodangal Police Station Patnam Narender Reddy Pharma Industrial Corridor Vikarabad incident

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.