📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: Vemula Prashanth Reddy: మంత్రుల మధ్య కోరవడుతున్న సమన్వయం

Author Icon By Sushmitha
Updated: October 25, 2025 • 4:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Vemula Prashanth Reddy) మంత్రుల మధ్య కోరవడుతున్న సమన్వయం) సంచలన ఆరోపణలు చేశారు. ‘ఇందిరమ్మ రాజ్యం’లో రోజుకో అవినీతి, పూటకో కుంభకోణం బయటపడుతోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన, హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (HAM) పద్ధతిలో చేపడుతున్న రోడ్ల టెండర్లలో దాదాపు రూ.8 వేల కోట్ల భారీ కుంభకోణం జరుగుతోందని ఆరోపించారు.

Read also : Jaishankar: ఐక్య‌రాజ్య‌స‌మితి ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తోంది .. జైశంక‌ర్

మంత్రుల వాటాలు, ఇతర కుంభకోణాలు

మంత్రుల మధ్య వాటాల కోసం గొడవలు జరుగుతున్నాయని, ఒక టెండర్ విషయంలో ఇద్దరు మంత్రులకు ముఖ్యమంత్రే స్వయంగా వాటాలు పంచి సెటిల్‌మెంట్ చేశారని ప్రశాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. డెక్కన్ సిమెంట్స్ కంపెనీని బెదిరించిన ఘటనలోనూ, మద్యం సీసాల హోలోగ్రాం కుంభకోణంలోనూ ముఖ్యమంత్రి పాత్ర ఉందని ఆరోపించారు. అవినీతి, ముడుపుల విషయంలో మంత్రులు రోజూ గొడవ పడుతున్నారని, దీంతో ఇందిరమ్మ రాజ్యం కుంభకోణాల నిలయంగా మారిందని విమర్శించారు.

హ్యామ్ టెండర్లపై వివరాలు, సవాల్

హ్యామ్ టెండర్ల గురించి వివరిస్తూ, “కేవలం రూ.9 వేల కోట్లతో పూర్తయ్యే పనులకు రూ.17 వేల కోట్లకు టెండర్లు పిలిచారు. ఇందులో రూ.8 వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు. సీఆర్‌ఎఫ్ (CRF) నిధుల కింద కిలోమీటర్‌కు రూ.1.75 కోట్లు ఖర్చవుతుంటే, హ్యామ్ కింద కిలోమీటర్‌కు రూ.3.30 కోట్లు ఎలా ఖర్చవుతుంది? పది రోజుల తేడాలో ఇచ్చిన రెండు జీవోలలో ఇంత తేడా ఎందుకుంది?” అని ఆయన ప్రశ్నించారు. ఈ టెండర్లను తక్షణమే రద్దు చేయాలని, ఈ భారీ కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కు(Bandi Sanjay) చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణకు ఆదేశించాలని సవాల్ విసిరారు.

ముఖ్యమంత్రిపై ఆరోపణ, హెచ్చరిక

ముఖ్యమంత్రి తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే తరచూ ఢిల్లీకి వెళుతున్నారని ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ దోపిడీలో అధికారులు, ఇంజినీర్లు భాగస్వాములు కావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. రూ.8 వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసే ఈ టెండర్లపై ప్రతి వేదిక మీదా తమ గళం విప్పుతామని ఆయన స్పష్టం చేశారు.

వేముల ప్రశాంత్ రెడ్డి చేసిన ప్రధాన ఆరోపణ ఏమిటి?

హ్యామ్ (HAM) పద్ధతిలో చేపడుతున్న రోడ్ల టెండర్లలో రూ.8 వేల కోట్ల భారీ కుంభకోణం జరుగుతోందని ఆరోపించారు.

కేవలం రూ.9 వేల కోట్లతో పూర్తయ్యే పనులకు ఎంతకు టెండర్లు పిలిచారు?

రూ.17 వేల కోట్లకు టెండర్లు పిలిచారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read also :

brs Corruption Google News in Telugu HAM tenders Latest News in Telugu road scam. Telangana Congress telangana government Telugu News Today Vemula Prashanth Reddy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.