సూర్యాపేట: ధాన్యం ఉత్పత్తి, దిగుబడి మరియు కొనుగోళ్లలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖామంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar) అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసిన ఆయన, ఈ సందర్భంగా అనేక అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
Read Also: Stray dogs: వీధి కుక్కల నియంత్రణలో నెదర్లాండ్స్ ఆదర్శం

ధాన్యం కొనుగోళ్లలో చరిత్ర, రైతులకు హామీ
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని, తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి రైతులు నష్టపోకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రకృతి వైపరీత్యాల బారిన పడ్డ రైతాంగానికి బాసటగా నిలుస్తామన్నారు.
- కొనుగోళ్ల రికార్డు: తెలంగాణ(Telangana) రాష్ట్రంలో పండిన పంట ఆల్ టైం రికార్డ్ సృష్టించిందని, 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించుకోవడం దేశ చరిత్రలోనే ప్రథమం అన్నారు. 150 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు.
- చెల్లింపులు: ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల వ్యవధిలో రైతులకు సొమ్ము చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఎఫ్సీఐ నిబంధనల ప్రకారం తేమశాతం 17 ఉన్న ధాన్యం కొనుగోలు చేసి, 48 నుంచి 72 గంటల్లో రైతులకు మద్దతు ధరతో కలిపి బోనస్ డబ్బులు చెల్లిస్తామన్నారు.
- అభివృద్ధి: గరిడేపల్లి మండలంలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాల, కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. హుజూర్నగర్ పట్టణంలో రూ.7.5 కోట్లతో జూనియర్ కాలేజీ, రూ.4.5 కోట్లతో డిగ్రీ కాలేజీ నిర్మిస్తున్నట్లు చెప్పారు.
నీటి పారుదల, ఇతర పథకాలు
మంత్రి పాలకీడు మండలంలో పలు రోడ్డు పనులకు, విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.400 కోట్లతో పాలకీడు మండలంలో పదివేల ఎకరాలకు నీరు అందించే జవహర్ జాన్ పహాడ్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. అర్హులందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ గృహాలను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నామని, ఈ పథకం మత్స్య కార్మికులకు ఉపాధి కల్పిస్తుందని ఆయన అన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: