📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News:Tummala Nageswara Rao: మద్దతు ధరకు మొక్కజొన్న కొనుగోలు

Author Icon By Pooja
Updated: October 10, 2025 • 11:24 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : రాష్ట్రంలో రైతులు పండించిన మొక్కజొన్నను మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) తెలిపారు. మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్నను కొను గోలు చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ఈ మేరకు దీనికి సంబంధించి గురువారం ఒక ప్రకటనలో రాష్ట్రంలో 6,24,544 ఎకరాల్లో మొక్కజొన్న సాగు అయిందని, సగటున ఎకరాకు 18.50 క్వింటల్ దిగుబడి వచ్చి, మొత్తం 11.56 లక్షల టన్నుల దిగుబడి అవుతుందని అంచనా వేసినట్లు పేర్కొన్నారు.

Read Also: Raja Saab: ప్రభాస్ మాస్ లుక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్

ఇందులో 8.66 లక్షల టన్నుల మొక్కజొన్నలను కొనుగోలు చేయాల్సి ఉంటుం దని అంచనా వేశామన్నారు (Tummala Nageswara Rao). ఇందుకు గాను ప్రభుత్వంపై 2,400 కోట్ల రూపాయల భారం పడుతుందని వెల్లడించారు. గత నెల 3 వ వారం నుండే మార్కెట్లోకి భారీగా మొక్కజొన్న పంట రావడం వలన ధరలు తగ్గిపోయాయని వివరించారు. ప్రస్తుత మార్కెట్ ధరలు మద్దతు ధర క్వింటాలుకు 2,400 రూపాయలు ఉండగా, దానికన్నా 441 రూపాయలు తక్కువగా ఉందని చెప్పారు. దీని వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని వాపోయారు. రైతులు మొక్కజొన్నను(Corn) కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి, మద్దతు ధర పొందవలసిందిగా సూచించారు. తక్కువ ధరలకు ప్రైవేట్లో కాకుండా, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా అమ్ముకోవాలని కోరారు. గతేడాది కేంద్రం మద్దతు ధరకు సేకరించనప్పటికి రాష్ట్ర ప్రభుత్వమే దాదాపు 535 కోట్లు రూపాయలు ఖర్చు పెట్టి జొన్న పంటను మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసిందన్నారు. అదేవిధంగా పెసర, మినుము, సోయాచిక్కుడు, కంది, వేరుశనగ లాంటి పంటలపై కేంద్రం 25 శాతం సీలింగ్ విధిం చిందని ఇది రైతులకు అడ్డంకిగా మారు తుందని కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

https://vaartha.com/crime/crime-horrible-brother-in-law-kills-brother-in-law-because-he-is-short/561964/

Corn Procurement Maize MSP Telangana Farmers Telugu News Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.