News Telugu: Tummala Nageswara Rao- తప్పుడు ఆరోపణలు చేస్తున్న రాంచందర్‌రావు కు తుమ్మల నాగేశ్వరరావు కౌంటర్

Read Time:  1 min
News Telugu
News Telugu
FONT SIZE
GET APP

తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరత (Urea deficiency) ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రస్థాయిలో ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం కావాలనే సంక్షోభాన్ని సృష్టించి, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలని ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.

News Telugu
News Telugu

కేంద్రంపై నేరుగా దాడి

హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన తుమ్మల, తెలంగాణకు యూరియా కేటాయింపుల్లో కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు మార్లు విజ్ఞప్తి చేసినా, ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కూడా ప్రధానమంత్రి మోదీ అడ్డుకున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే బీజేపీ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీ నేతలపై విమర్శలు

తుమ్మల తన దూకుడు వ్యాఖ్యల్లో బీజేపీ నేతలపై కీలక వ్యాఖ్యలు చేసారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు (Ramchandra Rao) వాస్తవాలు తెలియకుండానే మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. రాంచందర్‌రావు వంటి బాధ్యతగల పదవిలో ఉన్న వ్యక్తి సోయి లేకుండా మాట్లాడడం వల్ల బీజేపీ ఎప్పటికీ బలపడదని వ్యాఖ్యానించారు. రైతులను అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు.

యూరియా కోటా విడుదల డిమాండ్

ఈ నెలాఖరులోగా తెలంగాణకు రావాల్సిన యూరియా కోటాను కేంద్రం తక్షణమే విడుదల చేయాలని తుమ్మల డిమాండ్ చేశారు. యూరియా సమస్యను కావాలనే రాజకీయరంగంలోకి లాగుతున్న కొందరు నాయకులపై రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

తుమ్మల నాగేశ్వరరావు ఎవరికి కౌంటర్ ఇచ్చారు?

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు తప్పుడు ఆరోపణలు చేసిన నేపథ్యంలో, తుమ్మల నాగేశ్వరరావు ఆయనకు కౌంటర్ ఇచ్చారు.

ఏ అంశంపై తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు?

తెలంగాణలో యూరియా కొరత సమస్యపై, అలాగే బీజేపీ నేతల ఆరోపణలపై ఆయన తీవ్రంగా స్పందించారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/fertilizers-support-only-for-those-who-bring-2-lakh-tons-of-fertilizers/telangana/533774/

Sharanya

రచయిత గురించి

Sharanya

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.