హైదరాబాద్ : కేంద్రంలోని మోదీ ప్రభుత్వ ఆర్థిక విధానాలతో దేశానికి అధికంగా ఆదాయం సమకూర్చుతున్న దక్షిణాది రాష్ట్రాలు అన్యాయానికి గురవుతున్నాయని, ఇది కేవలం ఆర్థిక వివక్షే మాత్రమే కాదని, రాజకీయ ఉద్దేశంతో కూడిన వివక్ష అని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) విమర్శించారు. ‘వికసిత్ భారత్’ నినాదమిస్తూ దేశ అభివృద్ధి గురించి గొప్పలు చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వం.. దక్షిణాది రాష్ట్రాల పట్ల ముఖ్యంగా తెలంగాణ విషయంలో స్పష్టమైన వివక్ష. నిరక్ష్యాన్ని కొనసాగిస్తోందని దుయ్యబట్టారు.
Read Also: TG Municipal Elections: రూ.5 లక్షల నగదు సీజ్!
దేశ ఆదాయానికి దక్షిణాది వెన్నెముక అని, 2018-19 నుంచి 2022-23 వరకు అయిదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం వసూలు చేసిన మొత్తం పన్నులు రూ.90.80 లక్షల కోట్లు అయితే, ఇందులో దక్షిణాది రాష్ట్రాల నుండే పావుభాగానికి పైగా రూ. 22.86 లక్షల కోట్లు వచ్చాయన్నారు. అయినప్పటికీ దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం తిరిగి ఇచ్చిన నిధులు మాత్రం కేవలం 16.3 శాతం మాత్రమేనని గణాంకాలు చెబుతున్నాయని స్పష్టం చేశారు. ఇది ఆర్ధిక సమాఖ్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధమని మంత్రి వ్యాఖ్యానించారు. పన్నులు చెల్లించిన ప్రతి రూపాయికి తిరిగి వచ్చే నిధులను పోల్చితే కేంద్రం పాటిస్తున్న ద్వంద్వ వైఖరి బయటపడుతుందని తెలిపారు.
రూపాయికి సగటున 30 పైసలు
దక్షిణాది రాష్ట్రాలకు రూపాయికి సగటున 30 పైసలు ఇస్తూ, ఇదే సమయంలో బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి ఉత్తరాది రాష్ట్రాలకు రూ.1కి రూ.4 చొప్పున ఇస్తున్నారని, ఇది ఆర్థిక అసమతుల్యతను పెంచడమే కాకుండా, ఉత్తర, దక్షి ణాది రాష్ట్రాల మధ్య విభేదాలను సృష్టించే ప్రమాదకర ధోరణి అని హెచ్చరించారు. ఎక్కువ పన్నులు చెల్లించే రాష్ట్రాలను శిక్షి ంచడం, తక్కువ వసూళ్లు చేసే రాష్ట్రాలను ప్రోత్సహించడం కేంద్ర విధానంగా మారిందని ఆరోపించారు. కేంద్రం చెప్పుకునే వికసిత్ భారత్ విధానం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం నుండి ప్రాతి నిధ్యం వహించే బిజెపి ఎంపీలు, కేంద్ర మంత్రులు కూడా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని పదేళ్లలో ఏనాడు ప్రశ్నించకపోగా, రాష్ట్రానికి అన్ని తెచ్చాం. ఇన్ని చేశాం, రాష్ట్ర ఖజానాకు కేంద్రమే పూర్తి నిధులు సమకూరు స్తుందనట్లు మాట్లాడటం వారి పతనానికి నాంది అని మంత్రి తుమ్మల హెచ్చరించారు.
జాతీయ రహదారుల నిర్మాణాలను కూడా రాష్ట్రానికి విడుదల చేసే నిధుల ఖాతాలలో వేస్తున్న బీజేపీ నేతలు, వాటిని నిర్మించి మళ్లీ ప్రజల నుండే టోల్ చార్జీల రూపంలో వసూలు చేస్తున్న విషయాన్ని మరిచారా అని ప్రశ్నించారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం రుణమాఫీ, రైతు భరోసా, పంట కొనుగోళ్లు, సాగునీటి ప్రాజెక్టులు, ఉచిత విద్యుత్ వంటి పథకాలతో భారీగా ఖర్చు చేస్తోందని, కానీ కేంద్రం నుంచి రావాల్సిన న్యాయమైన వాటా రాకపోవడం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి అడ్డంకిగా మారుతోందని మంత్రి తుమ్మల అన్నారు.
ఈసారి కేంద్ర బడ్జెట్లో చేర్చాల్సిందిగా తెలంగాణ చేసిన ప్రతిపాదనలలో ఒక్కటి కూడా మంజూరు చేయలేదని, ఇప్పటికైనా తెలంగాణను రాజకీయంగా శిక్షించే బడ్జెట్లు మానుకోని, ఫెడరలిజాన్ని గౌరవించి, న్యాయమైన వాటా ఇవ్వాలని కేంద్రప్రభుత్వానికి హితవు పలికారు.
Read hindi news: hindi.vaartha.com
E paper : epaper.vaartha.com
Read Also: