📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల రేపటి నుంచి JEE మెయిన్స్ కేస్లాపూర్లో వైభవంగా ప్రారంభమైన నాగోబా జాతర ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు ఈ రోజు బంగారం ధరలు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 600 అప్రెంటిస్ ఉద్యోగాలు 38 దేశాలపై అమెరికా కఠిన నిబంధనలు వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టుగా RCB గంభీర్‌పై స్టేడియంలో డౌన్ డౌన్ నినాదాలు.. కోహ్లీ షాక్ లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల రేపటి నుంచి JEE మెయిన్స్ కేస్లాపూర్లో వైభవంగా ప్రారంభమైన నాగోబా జాతర ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు ఈ రోజు బంగారం ధరలు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 600 అప్రెంటిస్ ఉద్యోగాలు 38 దేశాలపై అమెరికా కఠిన నిబంధనలు వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టుగా RCB గంభీర్‌పై స్టేడియంలో డౌన్ డౌన్ నినాదాలు.. కోహ్లీ షాక్ లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం

TSRTC: ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు

Author Icon By Saritha
Updated: January 20, 2026 • 11:48 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : రాష్ట్రంలోని (TSRTC) ఆర్టీసిలో పనిచేస్తున్న కార్మికులు, ఇప్పటికే రిటైర్ అయిన పెన్షనర్లు ఉద్యమబాట పట్టనున్నారు. ఆర్టీసిలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నేడు(మంగళవారం) ఎర్ర బ్యాడ్జిలతో పోరాట దినంగా నిర్వహించాలని ఆర్టీసి జేఏసీ నిర్ణయించింది. గత 8 సంవత్సరాలుగా రిటైర్ అయిన పెన్షనర్లకి సరైన సెటిల్మెంట్ బకాయిలు ఇవ్వక పోవడంతో రేపు(21న బుధవారం) బస్ భవన్ వద్ద బైటాయింపు కార్యక్రమం చేపట్టనున్నట్టు పెన్షనర్లు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress) ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిప్పటికీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆ పార్టీ ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో ఆర్టీసి కార్మికవర్గం తీవ్ర అసంతృప్తితో ఉన్నారని టిజిఎస్ ఆర్టీసి జెఎసి తెలిపింది. ఆర్టిసి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని చేస్తూ ఎర్ర బ్యాడ్జిలతో పోరాట దినం నిర్వహించాలని జేఏసీ నిర్ణయించింది.

Read Also: BCTA: ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలి

RTC workers on the path of movement

బస్ భవన్ ముందు బైఠాయింపు కార్యక్రమం

గత బిఆర్ఎస్ ప్రభుత్వం అవలంబించిన విధానాలనే ఈ ప్రభుత్వం కూడా అవలంబిస్తోందని, ఎన్ని మార్లు ఆర్టీసి(TSRTC) కార్మికుల సమస్యలను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ పరిష్కారం చేయటంలో తగిన శ్రద్ధ చూపకపోవడంతో జెఎసి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. సాక్షాత్తు ముఖ్య మంత్రి రేవంత్రెడ్డి కార్మిక దినోత్సవమైన మే 1, 2025న స్వయంగా స్పందించి ఆర్టీసి కార్మిక సమస్యలను పరిష్కరించేందుకు సానుకూలంగా ఉన్నామని బహిరంగంగా చెప్పి 7 నెలలు కావస్తున్నప్పటికీ ఒక్క డిమాండ్ కూడా పరిష్కారం చేయలేదన్నారు. అందులో భాగంగా సోమవారం వరకు పోస్టుకార్డు ఉద్యమం చేపట్టిన జెఎసి ఆర్టీసి కార్మికులు, ఉద్యోగులు అందరూ ఎర్ర బ్యాడ్జీలు (రిబ్బన్లు) ధరించి ‘పోరాట దినం’ పాటించాలని జేఏసీ నిర్ణయించింది.

రేపు బస్ భవన్ ముందు పెన్షనర్ల బైఠాయింపు.. తెలంగాణ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు గత 8 సంవత్సరాలుగా రిటైర్ అయిన వారికీ సరైన సెటిల్మెంట్ బకాయిలు ఇవ్వకపోవడంతోపాటు గత 6 నెలల నుండి ఆర్టీసీ మేనేజ్మెంట్ని కలిసి తమ ఇబ్బందులు తెలియజేసినప్పటికీ వారు స్పందించడం లేదని.. తప్పనిసరి పరిస్థితుల్లో చేసేదేమీ లేక రేపు(బుధవారం 21న) బస్ భవన్ వద్ద బైటాయింపు కార్యక్రమం చేపడుతున్నట్టు ఆర్టిసి విశ్రాంత ఉద్యోగుల సారధ్య కమిటీ తెలిపింది. తమ పెండింగ్ బకాయిల సాధన కోసం బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు బస్ భవన్ ముందు బైఠాయింపు కార్యక్రమం చేపడుతున్నట్టు ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 నుండి 6వేల మంది విశ్రాంత ఉద్యోగులందరూ హాజరవుతున్నారని తెలిపింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:


hyderabad Labour Movement Latest News in Telugu pensioners Red Badges Protest RTC Employees RTC JAC Struggle Day Telangana Telugu News tgsrtc announcement

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.