ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువవుతున్న నేపథ్యంలో వాహనదారుల నిర్లక్ష్యం, అతివేగం, ఫిట్నెస్ గడువు ముగిసిన వాహనాలు ప్రధాన కారణాలుగా గుర్తించారు. ఈ పరిస్థితిని మార్చేందుకు రవాణాశాఖ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. రాష్ట్రవ్యాప్తంగా(TSRTC) బుధ, గురువారాల్లో నిర్వహించిన తనిఖీల్లో 1,050 వాహనాలపై కేసులు నమోదు చేసి, 750 వాహనాలను స్వాధీనం చేసుకుంది. కర్నూలు ప్రైవేట్ బస్సు దగ్ధ ఘటన, చేవెళ్ల ఆర్టీసీ ప్రమాదం వంటి సంఘటనల నేపథ్యంలో అంతర్రాష్ట్ర ప్రైవేట్ బస్సులపై ప్రత్యేక దృష్టి పెట్టింది.
Read Also: Amit Malviya : 95 ఓటములు.. ఆ అవార్డులన్నీ రాహుల్కే దక్కుతాయి.. బీజేపీ నేత
ప్రతిరోజూ ప్రైవేట్ బస్సుల తనిఖీలు
తనిఖీల్లో సేఫ్టీ కిట్లు, సర్వీసింగ్, అనుమతి పత్రాలు వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. ఓవర్లోడింగ్, పెండింగ్ చలాన్లు ఉన్న గూడ్స్ వాహనాలు, కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులపై(TSRTC) కఠిన చర్యలు తీసుకోనున్నారు. రవాణా కమిషనర్ ఇలంబర్తి అన్ని జిల్లాల అధికారులకు 13 పాయింట్లతో కూడిన అమలు ప్రణాళికను పంపించారు. దీనిలో అక్రమ మార్పులు చేసిన వాహనాలు, అనుమతి లేకుండా మార్పులు చేసిన బస్సులు, ఫిట్నెస్ లేకుండా నడుస్తున్న వాహనాలపై చర్యలు ఉన్నాయి.
వారానికి రెండు సార్లు అంతర్రాష్ట్ర బస్సుల తనిఖీలు
హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్నగర్, ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అంతర్రాష్ట్ర ప్రైవేట్ బస్సులను(Interstate private buses) వారానికి రెండు సార్లు తనిఖీ చేయాలి. అదనంగా వారానికి ఒకసారి ఆకస్మిక తనిఖీలు కూడా తప్పనిసరి.
అధికారులను అనుసరించాల్సిన కీలక సూచనలు
- ప్రతి ఉమ్మడి జిల్లాలో రెండు ఎన్ఫోర్స్మెంట్ టీంలు ఏర్పాటు
- ఎంవీఐ, ఇద్దరు ఏఎంవీఐలు ప్రతి బృందంలో ఉండాలి
- పబ్లిక్ హాలిడేలు సహా రోజూ వాహనాల పర్యవేక్షణ
- ఫిట్నెస్ లేని హెవీ, మీడియం, స్కూల్ బస్సుల తనిఖీ
- గూడ్స్ వాహనాల్లో ఓవర్ లోడింగ్ నివారణ
- కాంట్రాక్ట్ బస్సుల్లో ప్రమాదకర వస్తువులు నిషేధం
- ఓపెన్ బాడీ వాహనాలను టిప్పర్లుగా మార్చితే చర్యలు
- ఆటోల్లో డ్రైవర్ పక్కన ప్రయాణికులు కూర్చోకుండా జాగ్రత్తలు
- మైనింగ్ శాఖతో కలిసి బయలుదేరే ప్రాంతాల్లోనే లోడింగ్ నియంత్రణ
- అనుమతి లేకుండా నడుస్తున్న వాహనాలపై కేసులు
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: