📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్

TS Assembly Sessions: అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం.. పెండింగ్ బిల్లుల కోసం పోరు!

Author Icon By Pooja
Updated: March 16, 2026 • 12:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

TS Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలిరోజే శాసనసభ ప్రాంగణం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రామాల్లో తాము చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) ఆధ్వర్యంలో మాజీ సర్పంచులు సోమవారం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో భారీ సంఖ్యలో తరలివచ్చిన మాజీ సర్పంచులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అసెంబ్లీ వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు.

Read Also:TG Assembly Sessions: ఆరు గ్యారంటీలు ఎక్కడ? ప్రభుత్వాన్ని ఎండగడతామన్న మహేశ్వర్‌రెడ్డి.

అసెంబ్లీ వద్ద హైటెన్షన్.. సర్పంచుల అరెస్ట్

సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ పరిసరాల్లో పోలీసులు ముందస్తుగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ముట్టడికి యత్నించిన జేఏసీ నాయకులను, మాజీ సర్పంచులను పోలీసులు మార్గమధ్యలోనే అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల చర్యతో నిరసనకారులకు, భద్రతా సిబ్బందికి మధ్య తోపులాట జరగడంతో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. అరెస్టు చేసిన వారిని బలవంతంగా వాహనాల్లో ఎక్కించి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.

తమ సొంత డబ్బులు వెచ్చించి గ్రామాల్లో పనులు పూర్తి చేశామని, ఏళ్ల తరబడి బిల్లులు రాకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆర్థికంగా చితికిపోతున్నామని మాజీ సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం నుంచి ప్రస్తుత ప్రభుత్వం వరకు పెండింగ్ బిల్లుల విషయంలో తమను మోసం చేస్తున్నాయని వారు మండిపడ్డారు. ఈ బడ్జెట్ సమావేశాల్లోనైనా తమ సమస్యలపై స్పష్టమైన ప్రకటన చేయాలని, లేనిపక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని జేఏసీ నేతలు హెచ్చరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

#AssemblyMuttadi #PendingBills #SarpanchJAC #TelanganaAssembly #TelanganaPolitics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.