📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Treasury: ఖజనాకు రూ.33,600 కోట్ల సమీకరణ

Author Icon By Sharanya
Updated: June 27, 2025 • 10:40 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

— పన్నురహిత ఆదాయంపై దృష్టి కేంద్ర గ్రాంటులపై ఆశలు ఆస్తుల ద్వారా సేకరించే ఆలోచన

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక సంక్షేమ పధకాలు, కార్యక్రమాలకు అవసరమైన వ్యయాన్ని సేకరించేందుకు కసరత్తు చేస్తోంది. రైతు భరోసా (Rythu bharosa) తో పాటు, స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఇందిరమ్మ ఆత్మీయ కానుక, మహాలక్ష్మి, ఇందిరమ్మ గృహనిర్మాణ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి రాష్ట్రం సిద్ధమవుతోంది. ఇందుకు పెరుగుతున్న ఆర్థిక ఒత్తిడిని అధికమించేందుకు ప్రత్యమ్నాయ ఆదాయ మార్గాలను అన్వేషిస్తోంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.33,600 కోట్లు

ఇందులో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.33,600 కోట్ల పన్నుయేతర ఆదాయాన్ని పెంచాలని నిర్ణయించింది. సమయంలో కేంద్ర గ్రాంట్లను తెచ్చేందుకు ప్రయత్నాలు ఆరంభించింది. అన్ని విభాగాలకు బడ్జెట్ కేటాయింపులను సమానంగా పాటించాలని స్పష్టం చేసినప్పటికీ, లోటు దృష్ట్యా ఆదాయాన్ని ఆర్జించే విభాగాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అంతర్గతంగా ఆర్థిక శాఖ సూచనలు చేసినట్లు సమాచారం. హేతుబద్ధీకరణ ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ, సమగ్ర సంస్కరణలు లేకపోవడం వల్ల రాష్ట్ర ఆదాయ లక్ష్యాలను పూర్తిగా చేరుకునే సామర్థ్యం పరిమితమైంది. పన్నుయేతర ఆదాయాన్ని పెంచడం మరియు ఆర్థిక స్థితిస్థాపకతను మెరుగుపరచడం లక్ష్యంగా కార్యాచరణ వ్యూహాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

ఇదే ఆదాయంలో గత నెల ప్రారంభం నాటికి కేవలం 6.23 శాతం మేర 10,916.68 కోట్లు వసూలు చేసింది. ఇది ఏప్రిల్ 2024లో సమీకరించిన రూ.11,464.17 కోట్ల కంటే దాదాపు రూ.548 కోట్లు తక్కువ. పన్నుయేతర ఆదాయ గణాంకాలు ఇంకా తక్కువగా ఉన్నాయి, గత సంవత్సరం ఇదే కాలంలో రూ.353.71 కోట్లు వసూలు చేయగా, ఏప్రిల్ చివరి నాటికి రూ.253.60 కోట్లు మాత్రమే వసూలు అయ్యాయి. అయితే, కేంద్రం నుండి గ్రాంట్స్ ఇన్ఎయిడ్ స్వల్ప మెరుగుదలను చూపించింది. గత ఏడాది సున్నా పంపిణీతో పోలిస్తే ఈ ఏప్రిల్లో రూ.68.85 కోట్లు విడుదలయ్యాయి.
వీటిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులు. భూమిని నిర్మాణాత్మక లీజుకు ఇవ్వడం. వేలం వేయడం వంటి వాటిపై కేంద్రీకరించింది. అలాగే గనులు మరియు ఖనిజాల నుండి, ముఖ్యంగా ఇసుక మైనింగ్ నుండి పన్నుయేతర ఆదాయాన్ని పెంచడానికి అధికారులు కొత్త ఖనిజ విధానాన్ని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.

Read also: Hyderabad: ట్యాంక్ బండ్ పై ఘనంగా కుమ్మర్ల తొలిబోనం జాతర

#economic growth #GovernmentRevenue #RevenueCollection #Rs33600 crores #telangana #TelanganaBudget #Treasure #TreasuryUpdate Breaking News in Telugu Breaking News Telugu epaper telugu google news telugu India News in Telugu Latest News Telugu Latest Telugu News News Telugu News Telugu Today Telugu Epaper Telugu News Telugu News Paper Telugu News Paper Online Telugu News Today Today News Telugu Today News Telugu Paper Today Rasi Phalalu in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.