📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

CM Revanth Reddy: నేడు వారికి కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలు

Author Icon By sumalatha chinthakayala
Updated: March 20, 2025 • 8:44 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్ శాఖలో కారుణ్య నియామకాలు చేపడతారు. మొత్తం 582 మంది తమ నియామకాల కోసం ఎదురుచూస్తున్నారు. వారందరికీ ఇవాళ సీఎం.. నియామక పత్రాలు ఇస్తారు. రవీంద్ర భారతిలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ మూడు శాఖల్లో పనిచేస్తూ ఎవరైనా ఉద్యోగులు చనిపోతే, వారి కుటుంబంలోని ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇస్తున్నారు. తద్వారా ఆ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంటుంది. ఈ కారుణ్య నియామకాలు చాలా కాలంగా జరగట్లేదు. అసలు తమకు ఉద్యోగం ఇస్తారా ఇవ్వరా అని బాధితులు ఎదురుచూస్తూ ఉండాల్సి వచ్చింది. ఐతే.. మంత్రి సీతక్క ఈ విషయాన్ని గమనించారు. ఎలాగూ ఇవ్వాల్సిన ఉద్యోగాలే. మళ్లీ వాటికి లేటు ఎందుకు అనుకున్న ఆమె.. ఫైళ్లను వేగంగా కదిలేలా చొరవ చూపించారు.

582 సూపర్ న్యూమరరీ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు

పంచాయ‌తీ రాజ్ విభాగంలో 582 సూపర్ న్యూమరరీ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు మంజూరు చేసేలా ప్ర‌భుత్వాన్ని సీత‌క్క ఒప్పించారు. దీంతో ఎప్పుడూ లేని విధముగా 582 సూపర్ న్యూమరరీ జూనియర్ అసిస్టెంట్ పోస్టులను ప్ర‌భుత్వం మంజూరు చేయ‌డంతో కారుణ్య నియ‌మాకాల‌కు మార్గం సుగుమమైంది. 582 కారుణ్య నియామ‌కాల‌తో పాటు, మిషన్ భగీరథ శాఖలో 55 మంది అసిస్టెంట్ ఇంజనీర్లు, 27 మంది జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లు, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖలో 38 మంది అసిస్టెంట్ ఇంజనీర్లు, 55 మంది జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లకు నియామక పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీత‌క్క అందజేయనున్నారు. కారుణ్య నియామ‌కాల‌కు అనుమ‌తులిచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం మ‌ల్లు బ‌ట్టి విక్ర‌మార్క‌కు సీత‌క్క ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Breaking News in Telugu CM Revanth Reddy employment letters Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.