📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

KTR : నేడు సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్న కేటీఆర్‌

Author Icon By Divya Vani M
Updated: June 18, 2025 • 8:21 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌ నుంచి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ (KTR) ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Siricilla District) పర్యటించనున్నారు.తంగళ్లపల్లి మండలంలోని అంకుసాపూర్‌ గ్రామంలో మాజీ ఎంపీటీసీ కర్కబోయిన కుంటయ్య మృతికి శ్రద్ధాంజలి ఘటించి, ఆయన కుటుంబాన్ని పరామర్శించనున్నారు. గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.కుంటయ్య తన భూమిని కాంగ్రెస్‌ నాయకుడు కబ్జా చేశాడంటూ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. నా భూమిని కాంగ్రెస్‌ నేత అక్రమంగా ఆక్రమించేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఇక నాకు ప్లాట్‌ లేదు, నా బిడ్డ పెళ్లికి ఏమీ మిగల్లేదు, అంటూ ఆవేదనతో సూసైడ్‌ నోట్‌ రాశాడు.కుంటయ్య ఆరోపణల ప్రకారం, స్థానిక సీఐ, ఎస్సై కూడా స్పందించలేదు. ఫిర్యాదు చేసిన వ్యక్తిపైనే కేసు పెట్టారు. ఈ సంఘటనపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వెల్లివెళ్లుతున్నాయి. కుంటయ్య చావుకు కాంగ్రెస్ నేతలే బాధ్యతవహించాలంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గడ్డిమందు తాగి ప్రాణాలొదిలిన సీనియర్ నేత

ఆత్మహత్యకు ముందు లేఖ రాసిన కుంటయ్య సోమవారం గడ్డిమందు తాగాడు. గవర్నమెంట్‌ ఆసుపత్రికి తరలించినా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఆయన భార్య విజయ, కుమార్తెలు భార్గవి (22), దీక్షిత (11) తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

‘కేటీఆర్‌ అన్నా, మా కుటుంబాన్ని ఆదుకోండి’ – సూసైడ్‌ లేఖ

నా చావుకు కారణం కాంగ్రెస్ నేతలే. కేటీఆర్‌ అన్నా, మా కుటుంబాన్ని మీరు ఆదుకోండి, అంటూ సూసైడ్‌ లేఖలో వేదన వ్యక్తం చేశారు కుంటయ్య. దీంతో కేటీఆర్‌ అక్కడికి చేరుకుని కుటుంబానికి అండగా నిలవనున్నారు.

Read Also : Telangana : తెలంగాణ లో ఓటు హక్కు ఉన్న 30 వేల మంది పేర్లు తొలగింపు : ఎందుకంటే?

BRS leader's suicide Congress leader's land grab KTR's consultation KTR's visit to Siricilla political turmoil in Rajanna Siricilla reasons for Kuntayya's suicide

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.