📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

నేడు కాంగ్రెస్ చలో రాజ్ భవన్

Author Icon By sumalatha chinthakayala
Updated: December 18, 2024 • 10:34 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. గౌతమ్ అదానీ విషయంలో చర్యలు తీసుకోవాలని, మణిపూర్ అల్లర్లపై ప్రధాని నరేంద్ర మోడీ మౌనం వీడాలని కోరుతూ ఈ నిరసన కార్య్రమం చేపట్టనున్నారు.

దేశ వ్యాప్తంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆందోళన పిలుపుతో ఇక్కడ కూడా నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఉదయం 11 గంటలకు ఇందిరా గాంధీ విగ్రహం నుంచి రాజ్ భవన్ వరకూ ర్యాలీగా వెళ్లనున్నారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి దీపాదాస్ మున్షీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. పోలీసులు ఈ సందర్భంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

అయితే.. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్..ఫైర్ అయ్యారు. ముఖ్య మంత్రే రాజ్ భవన్ ముట్టడికి వెళ్తే.. రాష్ర్టంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితేంటి..? అంటూ నిలదీశారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్.. సమావేశాలు తప్పించుకువడానికే ఇలాంటివి చేస్తున్నారని ఆగ్రహించారు. ప్రభుత్వం మనుసు మార్చుకోవాలని డిమాండ్‌ చేశారు. పరిపాలన చేయడానికి ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు..ధర్నాలు చేయడానికి కాదంటూ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ చురకలు అంటించారు . ఈ రాష్ర్టంలో ప్రభుత్వం ఉందా అనే అనుమానం వ్యక్తం అవుతుందని ఫైర్ అయ్యారు.

chalo raj bhavan CM Revanth Reddy congress gautam adani issue PM Modi

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.