నేడు కాంగ్రెస్ చలో రాజ్ భవన్

Read Time:  1 min
Today Congress Chalo Raj Bhavan
Today Congress Chalo Raj Bhavan
FONT SIZE
GET APP

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. గౌతమ్ అదానీ విషయంలో చర్యలు తీసుకోవాలని, మణిపూర్ అల్లర్లపై ప్రధాని నరేంద్ర మోడీ మౌనం వీడాలని కోరుతూ ఈ నిరసన కార్య్రమం చేపట్టనున్నారు.

దేశ వ్యాప్తంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆందోళన పిలుపుతో ఇక్కడ కూడా నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఉదయం 11 గంటలకు ఇందిరా గాంధీ విగ్రహం నుంచి రాజ్ భవన్ వరకూ ర్యాలీగా వెళ్లనున్నారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి దీపాదాస్ మున్షీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. పోలీసులు ఈ సందర్భంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

అయితే.. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్..ఫైర్ అయ్యారు. ముఖ్య మంత్రే రాజ్ భవన్ ముట్టడికి వెళ్తే.. రాష్ర్టంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితేంటి..? అంటూ నిలదీశారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్.. సమావేశాలు తప్పించుకువడానికే ఇలాంటివి చేస్తున్నారని ఆగ్రహించారు. ప్రభుత్వం మనుసు మార్చుకోవాలని డిమాండ్‌ చేశారు. పరిపాలన చేయడానికి ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు..ధర్నాలు చేయడానికి కాదంటూ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ చురకలు అంటించారు . ఈ రాష్ర్టంలో ప్రభుత్వం ఉందా అనే అనుమానం వ్యక్తం అవుతుందని ఫైర్ అయ్యారు.

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.