📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

సీఎల్పీ సమావేశానికి డుమ్మా కొట్టిన ఆ 10 మంది ఎమ్మెల్యేలు

Author Icon By Sudheer
Updated: February 6, 2025 • 2:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ (సీఎల్పీ) సమావేశం హైదరాబాదులోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో కొనసాగుతోంది. ఈ సమావేశంలో ముఖ్యంగా బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ, అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యాచరణపై ముఖ్యంగా చర్చ జరిగింది. మొత్తం 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణను చారిత్రాత్మక నిర్ణయాలుగా అభివర్ణించి, వీటి ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించారు.

ఈ మేరకు తెలంగాణలో రెండు భారీ బహిరంగ సభలను నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. బీసీ కులగణన సభను ఉత్తర తెలంగాణలో, ఎస్సీ వర్గీకరణ సభను ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సభలకు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీలను ఆహ్వానించాలని నిర్ణయించుకున్నారు. వీటిని విజయవంతం చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని నేతలకు సూచించారు.

అయితే, ఈ సమావేశానికి ఇటీవల పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యే అవకాశం ఉన్నప్పటికీ, వారు చివరి నిమిషంలో డుమ్మా కొట్టారు. కాంగ్రెస్ అధిష్టానం వారిని సమావేశానికి హాజరయ్యేందుకు ఆహ్వానించినప్పటికీ, వారు గైర్హాజరయ్యారు. ప్రస్తుతానికి ఈ ఫిరాయింపుల కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నందున, ఈ సమావేశానికి హాజరైతే రాజకీయంగా నష్టపోతామని భావించి, తమ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లకుండా దూరంగా ఉండాలని వారు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

10 MLAs who stayed silent CLP meeting Google news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.