Kharif Season : యూరియా కొరత లేకుండా చూడాలి – మంత్రి తుమ్మల విజ్ఞప్తి

Read Time:  1 min
Kharif Season : యూరియా కొరత లేకుండా చూడాలి – మంత్రి తుమ్మల విజ్ఞప్తి
FONT SIZE
GET APP

తెలంగాణ రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ (Kharif Season) ప్రారంభమవుతోందని, వర్షాలు కురుస్తుండటంతో రైతులు పంటల సాగును ప్రారంభించారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అయితే, రైతులు పంటల సాగు చేయాలనుకుంటున్న తరుణంలో యూరియా అందుబాటులో లేకపోవడం వల్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. యూరియా వంటి ముఖ్యమైన ఎరువుల కొరత వల్ల సాగు దెబ్బతినే అవకాశముందని ఆయన పేర్కొన్నారు.

కేంద్రం నుంచి సరిపడా సరఫరా లేకపోవడమే కారణం

ఈ పరిస్థితికి ప్రధాన కారణం కేంద్రం నుంచి తగినంత యూరియా (Urea ) సరఫరా అందకపోవడమేనని తుమ్మల వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎరువుల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని రామగుండంలోని RFCL (Ramagundam Fertilizers and Chemicals Limited) నుంచి తెలంగాణకు కేటాయించే కోటాను పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్రం నుంచి ముందస్తు చర్యలు తీసుకుంటేనే రైతుల అవసరాలను తీర్చగలమని చెప్పారు.

తగిన సప్లై చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి

రాబోయే మూడు నెలల్లో రాష్ట్రంలో యూరియా డిమాండ్ మరింత పెరిగే అవకాశముందని తుమ్మల పేర్కొన్నారు. అందుకే ముందుగానే తగిన మోతాదులో ఎరువులను సమకూర్చాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. రైతులకు అవసరమైన ఎరువుల పంపిణీ నిరాటంకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.

Read Also ; Chandrababu Naidu : ఇక్కడున్నది 2014 నాటి చంద్రబాబు కాదు…

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.