ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) మంగళవారం ప్రజాభవన్లో ‘గోదావరి-బనకచర్ల’ అంశంపై పవర్పాయింట్ ప్రజెంటేషన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితేశాయి.మాజీ సీఎం కేసీఆర్, హరీశ్ రావు చేసిన సంతకాలే తెలంగాణకు నీటి విషయంలో (Regarding water for Telangana) పెద్ద ప్రమాదంగా మారాయని రేవంత్ ఆరోపించారు. ఈ సంతకాలే రాష్ట్రానికి మృతిశాసనం వంటివి, అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణకు కేవలం 299 టీఎంసీలే ఎందుకు?
రాష్ట్రానికి కృష్ణా జలాల్లో 811 టీఎంసీల్లో కేవలం 299 టీఎంసీలే ఇవ్వాలని అప్పటి బీఆర్ఎస్ నేతలు అంగీకరించారని రేవంత్ వెల్లడించారు. “మిగిలిన 68 శాతం నీటిని ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేందుకు వారు 2015లో సంతకం చేశారు,” అంటూ విమర్శలు గుప్పించారు.పదిళ్లపాటు నీటిపారుదల శాఖను నిర్వహించిన వారు తెలంగాణ హక్కులను నిర్లక్ష్యం చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభమైన ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వల్ల, కేటాయించిన నీటిని కూడా వినియోగించలేకపోతున్నట్టు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ స్పీడు – తెలంగాణ ఆలస్యం
మనవాళ్లు ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే, పొరుగురాష్ట్రం మాత్రం తన పనులు పూర్తి చేసేసుకుని నీటిని తరలించుకుపోతోంది, అని సీఎం వాపోయారు. ఇది తెలంగాణకు ఘోరమైన నష్టం అని అన్నారు.తెలంగాణ నీటి హక్కుల విషయంలో ఒక అంగుళం కూడా వెనక్కి తగ్గం, అని రేవంత్ స్పష్టం చేశారు. రాజకీయంగా, సాంకేతికంగా, న్యాయపరంగా పోరాటం చేస్తాం, అని తెలిపారు.
ప్రజల నమ్మకాన్ని తేలికగా తీసుకున్నారు
పదేళ్ల పాలనలో కేసీఆర్, హరీశ్ రావులపై ప్రజలు పూర్తి నమ్మకంతో ఉన్నారని కానీ, వారే చేసిన నిర్ణయాలు రాష్ట్రాన్ని నీటి విషయంలో సంక్షోభంలోకి నెట్టేశాయని రేవంత్ విమర్శించారు. ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ ప్రభుత్వం నిబద్ధంగా పనిచేస్తుందని పేర్కొన్నారు.
Read Also : Chandrababu: త్వరలో నిరుద్యోగ భృతి – సీఎం చంద్రబాబు