हिन्दी | Epaper

Formula E Race Case: ఫార్ములా-ఈ రేసు కేసులో బిగిస్తున్న ఉచ్చు.. అర్వింద్ కుమార్‌పై వేటు?

Anusha
Formula E Race Case: ఫార్ములా-ఈ రేసు కేసులో బిగిస్తున్న ఉచ్చు.. అర్వింద్ కుమార్‌పై వేటు?

Formula E Race Case: ఫార్ములా-ఈ రేసు నిర్వహణలో జరిగిన ఆర్థిక అవకతవకల కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం శనివారం (ఫిబ్రవరి 28, 2026) ఉత్తర్వులు జారీ చేసింది. గత కొన్ని రోజులుగా ఆయనపై విచారణ వేగవంతం కాగా, తాజాగా ఈ క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం రాష్ట్ర పరిపాలనా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Read Also: CM Revanth Reddy: జిహెచ్ఎంసీ స్థానంలో కోర్ అర్బన్ చట్టం

బదిలీ నుంచి సస్పెన్షన్ వరకు.. అసలేం జరిగింది?

రాష్ట్రవ్యాప్తంగా 45 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ గురువారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అప్పటివరకు రెవెన్యూ (విపత్తు నిర్వహణ) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అర్వింద్ కుమార్‌ను ఆ పోస్టు నుంచి తప్పించి, ఎక్కడా కొత్త బాధ్యతలు అప్పగించకుండా వెయిటింగ్‌లో ఉంచారు. తాజాగా ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో విచారణకు ఆటంకం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేయాలని నిర్ణయించింది. సంబంధిత దస్త్రంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతకం చేశారని, నేడో రేపో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

The trap being tightened in the Formula E race case.. Arvind Kumar to be suspended?
The trap being tightened in the Formula E race case.. Arvind Kumar to be suspended?

ఫార్ములా ఈ రేసు నిర్వహణలో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో అర్వింద్ కుమార్‌ను ప్రాసిక్యూట్ చేసేందుకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీఓపీటీ) ఫిబ్రవరి మధ్యలో అనుమతినిచ్చింది. ఈ అనుమతి లభించిన కొన్ని రోజులకే రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై బదిలీ వేటు వేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అర్వింద్ కుమార్ ఉన్నారు.

కేంద్రం నుంచి ప్రాసిక్యూషన్ అనుమతి

ఆ సమయంలోనే ఫార్ములా ఈ రేసు కోసం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) నుంచి దాదాపు రూ.55 కోట్లను రాష్ట్ర కేబినెట్, ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా బదిలీ చేశారని ఏసీబీ ఆరోపిస్తోంది. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌ను ఏ-1గా, అర్వింద్ కుమార్‌ను ఏ-2గా పేర్కొంటూ ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. కేంద్రం నుంచి ప్రాసిక్యూషన్‌కు అనుమతులు రావడంతో, ఏసీబీ త్వరలోనే ఈ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో శాఖాపరమైన చర్యల్లో భాగంగానే అర్వింద్ కుమార్‌ను పోస్టింగ్ ఇవ్వకుండా బదిలీ చేయడం, సస్పెన్షన్ వేటుకు సిద్దమైనట్లు తెలుస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870