TGSRTC: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress govt) అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకంలో భాగంగా మహిళలు.. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికైనా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించింది. ఇటీవల ఓ వార్త సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది. రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులు అందరికీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందిస్తున్నట్లు మీడియా, సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతోంది. ఈ వార్తపై తాజాగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ క్లారిటీ ఇచ్చింది.
Read Also: Petrol Bunks: తెలంగాణ లో మహిళా పెట్రోల్ బంకులు
తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు
సోషల్ మీడియాలో జరుగుతన్న ప్రచారం అబద్ధం అంటూ ఆర్టీసీ అధికారులు వివరణ ఇచ్చారు. ఆర్టీసీ యాజమాన్యం దివ్యాంగులందరికీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై ప్రభుత్వం ఎలాంటి కొత్త ఉత్తర్వులు జారీ చేయలేదని స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుడు వార్తలను సోషల్ మీడియాలో ప్రచారం చేసి.. ప్రజలను తప్పుదోవ పట్టించే వారిపై కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని తీవ్ర హెచ్చరికలు చేసింది. రాష్ట్ర ప్రజలు ఇలాంటి పుకార్లను నమ్మొద్దని తెలిపింది. ప్రభుత్వం ఏదైనా కొత్త నిర్ణయం తీసుకుంటే.. దాన్ని పత్రికా ప్రకటన ద్వారా టీజీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ ద్వారా వెల్లడిస్తామని తేల్చి చెప్పింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: