హైదరాబాద్: నష్టాల్లో ఉన్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)ను(TGSRTC) లాభాల్లోకి తీసుకురావడానికి, రెవెన్యూ పెంచుకోవడానికి అవకాశాలను అన్వేషించాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) ఉన్నతాధికారులకు సూచించారు. నష్టాల్లో ఉన్న డిపోలపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి, వాటిని లాభాల్లోకి వచ్చేలా ప్రత్యేక కార్యాచరణను రూపొందించాలని ఆయన ఆదేశించారు. నగరంలో పెరుగుతున్న కొత్త కాలనీలకు అనుగుణంగా బస్సు రూట్లు పెంచేలా అధ్యయనం చేయాలన్నారు.
Read Also: MD Manoj Gaurnu: ఎస్ఎల్బిసి టన్నెల్ నిర్మాణ సంస్థ
భద్రత, ఉద్యోగులు, ఆస్తులపై నిర్ణయాలు
ఆర్టీసీ ఉన్నతాధికారులతో గురువారం సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు:
- ప్రమాదాల తగ్గింపు: బస్సు ప్రమాదాలు తగ్గించడానికి త్వరలో డ్రైవర్ మానిటరింగ్ సిస్టం అమలు చేయనున్నట్టు మంత్రి స్పష్టం చేశారు.
- ఉద్యోగుల ప్రయోజనం: కారుణ్య నియామకాల కింద నియమించబడిన కండక్టర్ల ప్రొవిజన్ పిరియడ్ను 3 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలకు తగ్గించేలా పరిశీలించాలన్నారు.
- ఆస్తి అభివృద్ధి: అరాంఘర్లో అధునాతన బస్సు టెర్మినల్ నిర్మాణం కోసం ఆర్టీసీ, పోలీస్ శాఖల భూ బదలాయింపుపై చర్చించాలని సూచించారు. హైదరాబాద్ నగరంలో కొత్త బస్సు డిపోలకు స్థల పరిశీలన చేసి కలెక్టర్ల నుంచి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
- ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా ఫోర్త్ సిటీలో బస్ టెర్మినల్ ఏర్పాటుపై అధ్యయనం చేయాలని మంత్రి సూచించారు. త్వరలోనే ఆర్టీసీ ఉద్యోగులతో జూమ్ సమావేశం నిర్వహిస్తానని తెలిపారు.
ఆదాయంపై దృష్టి: మహాలక్ష్మి పథకం, నాన్-టికెట్ రెవెన్యూ
మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత ఆర్టీసీ క్రమక్రమంగా లాభాల బాటలోకి వస్తున్నప్పటికీ, అదనపు ఆదాయంపై దృష్టి సాధించాలని మంత్రి ఆదేశించారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటివరకు మహిళలు ₹7,980 కోట్ల విలువైన జీరో టికెట్ ప్రయాణాన్ని ఉపయోగించుకున్నారని, ఇందుకోసం ఆర్టీసీకి ప్రభుత్వం ఆ మొత్తాన్ని చెల్లించిందని తెలిపారు. టికెట్ ఆదాయంతో పాటు టికెట్-యేతర ఆదాయంపై దృష్టి సారించాలని మంత్రి దిశానిర్దేశం చేశారు. ఆర్టీసీ బస్సులు, బస్ స్టేషన్లలో, టిమ్ మిషన్ల ద్వారా వచ్చే టికెట్పై అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా ఆదాయాన్ని మరింత పెంచాలని సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: