TGSPDCL: వేసవి కాలంలో ఎదురయ్యే విద్యుత్ (Electricity) సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన వాట్సాప్ చాట్బాట్ సేవలను ప్రారంభించింది. దీని ద్వారా కార్యాలయాలకు వెళ్లే పని లేకుండా, ఇంట్లో కూర్చునే మొబైల్ ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చు.
ఈ చాట్బాట్ ద్వారా ఫిర్యాదులు నమోదు చేయడం, వాటి ప్రస్తుత స్థితిని తెలుసుకోవడం, కరెంట్ బిల్లు వివరాలు, విద్యుత్ సరఫరా సమాచారం వంటి అనేక సేవలను సులభంగా పొందవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీతో ఈ చాట్బాట్ను రూపొందించామని, దీనివల్ల వినియోగదారులకు మరింత వేగంగా, సమర్థవంతంగా సేవలు అందుతాయని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు.
Read Also: Sangareddy Road Accident: వాటర్ ట్యాంకర్ను ఢీకొట్టిన కంటైనర్!

సైబర్ మోసగాళ్ల పట్ల జాగ్రత్త
ఇటీవల కాలంలో “మీ కరెంట్ బిల్లు పెండింగ్లో ఉంది, వెంటనే చెల్లించకపోతే కనెక్షన్ కట్ చేస్తాం” అంటూ వచ్చే నకిలీ కాల్స్, మెసేజ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ హెచ్చరించారు. అపరిచితులు పంపే లింకులను క్లిక్ చేయవద్దని, బిల్లు చెల్లింపుల విషయంలో ఏదైనా సందేహం ఉంటే వెంటనే అధికారిక వాట్సాప్ చాట్బాట్ ద్వారా వివరాలు సరిచూసుకోవాలని ముషారఫ్ ఫరూఖీ సూచించారు.
డిజిటల్ తో వేగవంతమైన సేవలు
సాధారణంగా విద్యుత్ సమస్యలపై కాల్ సెంటర్కు ఫోన్ చేస్తే లైన్ కలవకపోవడం వంటి ఇబ్బందులు ఉంటాయి. కానీ, ఈ ఏఐ (AI) ఆధారిత చాట్బాట్ ద్వారా వేల మంది వినియోగదారులకు ఒకేసారి వేగవంతమైన సేవలు అందుతాయని అధికారులు తెలిపారు. ప్రతి వినియోగదారుడు ఈ నంబర్ను సేవ్ చేసుకోవడం ద్వారా కరెంట్ బిల్లుల పేరుతో జరిగే మోసాల నుండి తమను తాము కాపాడుకోవచ్చని ఫరూఖీ స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: