జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ(TGMunicipal Elections Results) ఎన్నికల ఫలితాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు షాక్ ఇస్తూ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) అభ్యర్థులు భారీ విజయం సాధించారు. తెలంగాణ జాగృతి చీఫ్ కవిత మద్దతుతో ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై పోటీ చేసిన అభ్యర్థులు స్థానికంగా ప్రభంజనం సృష్టించారు.
Read Also:Kalwakurthy Results: ‘ఒక్క ఓటు’ తేడాతో కాంగ్రెస్ విజయం
10 వార్డుల్లో 8 చోట్ల జాగృతి అభ్యర్థుల గెలుపు
వడ్డేపల్లి మున్సిపాలిటీలోని మొత్తం 10 వార్డులకు జరిగిన ఎన్నికల్లో ఫార్వర్డ్ బ్లాక్ (జాగృతి) అభ్యర్థులు 8 వార్డుల్లో విజయం సాధించారు. మిగిలిన రెండు(TGMunicipal Elections Results) వార్డుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ చెరో ఒక వార్డులో గెలుపొందాయి. 10 స్థానాల్లో 8 చోట్ల జాగృతి మద్దతు అభ్యర్థులే గెలవడంతో వడ్డేపల్లి మున్సిపాలిటీని ఆ పార్టీ ఏకపక్షంగా కైవసం చేసుకుంది.
రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ కొనసాగుతున్నప్పటికీ, వడ్డేపల్లి పట్టణంలో స్థానిక ప్రజలు జాగృతి అభ్యర్థులకు పెద్ద ఎత్తున మద్దతు పలికారు. ఈ విజయం సందర్భంగా కార్యకర్తలు సింహం గుర్తు జెండాలతో భారీ ర్యాలీ నిర్వహిస్తూ సంబరాలు చేసుకున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: