📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

TG: ఎన్నికల వేళ విద్యార్థులకు వరుసగా 3 రోజులు సెలవు..?

Author Icon By Rajitha
Updated: February 4, 2026 • 1:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విద్యార్థులకు గుడ్‌న్యూస్ వచ్చేసింది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వరుసగా సెలవులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుండగా, ఆ రోజు ఆయా పట్టణాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఓటు హక్కు వినియోగానికి ఉద్యోగులకు కూడా హాలిడే ప్రకటించే అవకాశముంది. ఫిబ్రవరి 13న కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో ఆ రోజు కూడా సెలవు ఉండవచ్చని సమాచారం. అయితే దీనిపై అధికారిక ఉత్తర్వులు రావాల్సి ఉంది.

Read also: Ahmedabad: లంగ్స్ లోకెళ్ళిన హల్క్ బొమ్మ వైద్యులకే పెద్ద సవాలు

Will students get three consecutive days of holiday during the election period

ఫిబ్రవరి 14న రెండో శనివారం కావడంతో

ఒకవేళ ఫిబ్రవరి 11, 13 తేదీల్లో సెలవులు మంజూరైతే విద్యార్థులకు వరుసగా మూడు రోజుల సెలవులు దక్కనున్నాయి. ఫిబ్రవరి 14న రెండో శనివారం కావడంతో పాఠశాలలకు సెలవు ఉంటుంది. ఫిబ్రవరి 15న ఆదివారం కూడా సాధారణ సెలవే. దీంతో ఎన్నికలు జరిగే పట్టణాల్లోని విద్యార్థులకు వరుసగా సెలవులు వచ్చే అవకాశంపై ఆసక్తి నెలకొంది. అధికారిక ఉత్తర్వులు వెలువడితే ఇది నిజంగా విద్యార్థులకు శుభవార్తే అవుతుంది. ఈ విషయంపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఆర్థిక అంశాలపై బడ్జెట్ సమావేశాలు

ఇక ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంపై తెలంగాణ టీచర్స్ ఐకాస (టీజీ టీజాక్) నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును కలిశారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులు, సమగ్ర శిక్ష ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక, ఆర్థికేతర సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం సమర్పించారు. ఆర్థికేతర అంశాలను సంబంధిత శాఖలకు పంపిస్తామని సీఎస్ హామీ ఇచ్చారు. ఆర్థిక అంశాలపై బడ్జెట్ సమావేశాల అనంతరం చర్చిస్తామని తెలిపారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్, పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్‌ను కూడా కలిసినట్లు నేతలు వెల్లడించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

latest news municipal elections Telangana school holiday news Telangana students holidays Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.