📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

TG Weather: వణికిస్తున్న చలి.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

Author Icon By Tejaswini Y
Updated: November 8, 2025 • 12:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ(TG Weather) రాష్ట్రంలో వర్షాల ప్రభావం తగ్గి, చలి తీవ్రత పెరుగుతోంది. రానున్న రోజుల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా చలి ప్రభావం మరింతగా ఉండబోతోందని తెలిపింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 9 నుంచి 14 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రంలోని 23 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 12 నుండి 14 డిగ్రీల మధ్య ఉండవచ్చని సూచించారు. ప్రజలు రాత్రి వేళలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే బయటకు వెళ్లడం నివారించాలని సూచించారు.

Read Also: Shamshabad Airport: సాంకేతిక సమస్యల కారణంగా పలు విమానాలు ఆలస్యం..

ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

ముఖ్యంగా ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ జిల్లాలకు వాతావరణ(Weather) శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువకు పడిపోవచ్చని అంచనా వేసింది.

ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. శనివారం ఆదిలాబాద్ జిల్లా బేలలో 14.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రేపటి నుంచి రాష్ట్రంలో చలి ప్రభావం మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

IMDHyderabad TelanganaNews TelanganaWeather Telugu News online Telugu News Today WeatherUpdate

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.