తెలంగాణ (Telangana) రాష్ట్రంలో రేపు వాతావరణం అనిశ్చితంగా ఉండే అవకాశం ఉంది. రాష్ట్ర వాతావరణ శాఖ తెలిపిన హెచ్చరికల ప్రకారం, సెప్టెంబర్ 17న ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాలలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాలు ఈ వర్ష ప్రభావానికి ఎక్కువగా లోనవుతాయని అధికారులు భావిస్తున్నారు.
విశ్లేషకుల వివరాల ప్రకారం, ఆగ్నేయ బంగాళాఖాతం (Bay of Bengal) లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, తూర్పు విదర్భ ప్రాంతంలోని వాతావరణ వ్యవస్థ కలసి వర్షపాతం పెరగడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. ఈ కారణంగా రేపు రాత్రి వరకు రాష్ట్రంలో వర్షాల తీరులో ఎక్కువ ఊహించని పరిస్థితులు ఏర్పడవచ్చని సూచిస్తున్నారు.హైదరాబాద్ (Hyderabad) సహా మేడ్చల్, రంగారెడ్డి ప్రాంతాల్లో మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా ఆకాశం మబ్బులతో కమ్ముకొని జోరుగా వర్షం కురిసే పరిస్థితులు నెలకొంటాయి.
జాగ్రత్తలు..
క్యుములోనింబస్ మేఘాల ఏర్పాటుతో సాయంత్రం గంటల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ జామ్లు, లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడం, విద్యుత్ అంతరాయం వంటి సమస్యలు తలెత్తవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు.వర్షాలు విస్తృతంగా కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదు.
వర్షాల సమయంలో ఎలక్ట్రిక్ పోల్స్, ఓపెన్ వైరింగ్ దగ్గర నిలబడరాదు. వాహనదారులు తక్కువ వేగంతో ప్రయాణించాలి. లోతట్టు ప్రాంతాలు, నదీ వాగుల దగ్గర జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులు పిల్లలను నీటి మడుగుల దగ్గర ఆడనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: