📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు

News Telugu: TG: తెలంగాణను దేశంలోనే నంబర్ వన్‌గా నిలిపాం: రేవంత్ రెడ్డి

Author Icon By Rajitha
Updated: December 7, 2025 • 11:34 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణను వివిధ రంగాల్లో దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth reddy) ప్రకటించారు. వరి ఉత్పత్తిలో పెరుగుదల, చట్టవ్యవస్థ బలపడటం, గంజాయి నిర్మూలనలో రాష్ట్రం ముందంజలో ఉండటం తమ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని చెప్పారు. త్వరలోనే విద్య, వైద్య రంగాల్లోనూ ఇదే విజయాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా దేవరకొండలో జరిగిన ప్రజాపాలన విజయం సభలో పాల్గొన్న ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి, అక్కడి ప్రజలకు కొత్త హామీలు ఇచ్చారు. దేవరకొండ అభివృద్ధికి ప్రత్యేక నిధులు, నర్సింగ్ కాలేజీ వంటి పథకాలను చేపడతామని తెలిపారు.

Read also: TG: గ్లోబల్ సమ్మిట్‌లో ప్రసంగించనున్న ప్రముఖుల జాబితా ఇదే!

We have positioned Telangana as number one

4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి

ఈ సభలో మాజీ సీఎం కేసీఆర్‌పై మండిపడ్డ రేవంత్, దశాబ్దం పాటు కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని అప్పుల బారిన పడేలా చేసిందని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌లో కేటీఆర్‌నే ప్రధాన అడ్డంకిగా ప్రజలు భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లపై బీఆర్ఎస్‌కు సవాల్ విసిరిన ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భారీ నిధులు కేటాయించిందని అన్నారు. నల్లగొండ జిల్లాకు కీలకమైన ఎస్ఎల్‌బీసీ, డిండి ప్రాజెక్టులను ఎవరు అడ్డుకున్నా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో అభివృద్ధి కోసం పనిచేసే నాయకులను గెలిపించాలని ప్రజలను కోరారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

KCR ktr latest news Politics Revanth Reddy Telangana Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.