TG: భార్య మరణాన్ని తట్టుకోలేక మరుసటి రోజే భర్త మృతి

Read Time:  1 min
TG: భార్య మరణాన్ని తట్టుకోలేక మరుసటి రోజే భర్త మృతి
FONT SIZE
GET APP

భార్య మరణాన్ని తట్టుకోలేక ఆమె మరణించిన మరుసటి రోజే భర్త కూడా ప్రాణాలు కోల్పోయిన ఘటన (TG) కోమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని(Asifabad District) దహేగాం మండల పరిధిలో వెలుగు చూసింది. కమ్మర్‌పల్లి గ్రామానికి చెందిన దుర్గం వినోద్‌ అనే వ్యక్తికి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం గురిజాల గ్రామానికి చెందిన సువర్ణ అనే యువతితో 2020లో వివాహం జరిగింది.

Read Also: Telangana Municipal Elections: ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం: రాహుల్ గాంధీ హర్షం

TG: భార్య మరణాన్ని తట్టుకోలేక మరుసటి రోజే భర్త మృతి
Unable to cope with his wife’s death, the husband died the next day

ఈ దంపతులు ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అంతా హ్యాపీగా ఉందనే క్రమంలో భార్య సువర్ణకు ఆరోగ్యం క్షీణించింది. దీంతో గత కొన్నాళ్లుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతుంది. ఇటీవల ఆమె పరిస్థితి మరింత విషమించడంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. (TG) హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ సువర్ణ మృతి చెందింది.

ఇక సువర్ణ మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబ సభ్యులు.. అయితే అంత్యక్రియలు ముగించుకొని ఇంటికి రాగానే భర్త వినోద్ అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు అతన్ని వెంటనే స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ వినోద్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్టు నిర్ధారించారు. 24 గంటల వ్యవధిలోనే భార్య భర్తలు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.