📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు

TG: ఈనెల 12న రెండు కొత్త పథకాలు అమలు

Author Icon By Saritha
Updated: January 10, 2026 • 4:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ ప్రభుత్వం సామాజిక భద్రత, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మరో చారిత్రాత్మక అడుగు వేస్తోంది. (TG) దివ్యాంగులు, వృద్ధులు, చిన్నారుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రణామం, బాల భరోసా అనే రెండు వినూత్న పథకాలను రూపొందించింది. ఈ నెల 12న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) గారు ఈ ప్రతిష్టాత్మక పథకాలను లాంఛనంగా ప్రారంభించనున్నారు. దివ్యాంగుల సహకార సంస్థ చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా ఒకే ఆర్థిక సంవత్సరంలో భారీ స్థాయిలో నిధులను కేటాయించి వారిని ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

Read also: Srisailam: ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

వైకల్య రహిత తెలంగాణ దిశగా కీలక అడుగులు

దివ్యాంగుల కోసం ప్రభుత్వం సుమారు రూ. 50 కోట్ల భారీ నిధిని కేటాయించింది. ఇందులో భాగంగా రూ. 43.22 కోట్ల విలువైన అత్యాధునిక సహాయక పరికరాలను సుమారు 7 వేల మంది అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేయాలని నిర్ణయించింది. (TG) ఈ పరికరాల జాబితాలో దివ్యాంగుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే రెట్రోఫిట్టెడ్ మోటరైజ్డ్ వాహనాలు, బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్లు, వీల్ చైర్లతో పాటు విద్యా, ఉపాధి అవకాశాల కోసం ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ ఫోన్లు, వినికిడి యంత్రాలు ఉన్నాయి.

వృద్ధుల కోసం ప్రణామం డే కేర్ సెంటర్లు వృద్ధాప్యంలో ఒంటరితనంతో బాధపడే వృద్ధుల మానసిక ఉల్లాసం, సంరక్షణ కోసం ‘ప్రణామం’ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 37 మల్టీ సర్వీస్ డే కేర్ సెంటర్లను మంజూరు చేశారు. వైకల్య రహిత తెలంగాణే లక్ష్యంగా బాల భరోసా రాష్ట్రంలోని చిన్నారుల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఐదేళ్ల లోపు చిన్నారుల్లో ఉండే శారీరక లేదా మానసిక వైకల్యాలను ప్రాథమిక దశలోనే గుర్తించి, వాటిని నివారించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం.

Read hindi news:hindi.vaartha.com

Epaper:epaper.vaartha.com

Read also:

Bala Bharosa Scheme Latest News in Telugu Pranaman Scheme Public Welfare social security telangana government Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.