మార్చి 31లోగా శిక్షణ పూర్తిచేసేలా పంచాయతీరాజ్ శాఖ కార్యాచరణ
హైదరాబాద్ : ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన (TG) నూతన సర్పంచ్లు, వార్డు మెంబర్లకు పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన కల్పించేందుకు శిక్షణా తరగతులను పంచాయ తీరాజ్శాఖ నిర్వహించనుంది. మార్చి 31లోగా శిక్షణను పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొం దించింది. అందులో భాగంగా శిక్షణ ఇచ్చే అధికారులకు ముందుగా రాజేంద్రనగర్ లోని టీజీఐఆర్డీలో తరగతులు నిర్వహిస్తున్నారు.
Read also: HYD: ప్రైవేట్ డయాగ్నస్టిక్స్ సెంటర్లలో దోపిడీ
మార్చి 31లోపు అన్ని జిల్లా కేంద్రాల్లో పూరిసాయిలో శికణ
పంచాయతీరాజ్శాఖ డిప్యూటీ కమిషనర్ ఏంవీ శైలేష్ హాజరై దిశానిర్దేశం చేస్తున్నారు. గ్రామాల్లో పాలన పారదర్శకంగా సాగాలన్నా, నిధుల వినియోగం సక్రమంగా ఉండాలన్నా చట్టంలోని నిబంధనలు సర్పంచ్లు, వార్డుమెంబర్లకు తెలియాలని పంచాయతీరాజ్ శాఖ (Panchayat Raj Department) చెబుతోంది. చట్టానికి లోబడి బాధ్యతలు నిర్వహించేలా సర్పంచ్లను, వార్డు సభ్యులను సన్నద్ధం చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించింది.
ప్రతీ జిల్లా నుంచి నలుగురు జిల్లా, మండలస్థాయి అధికారులతోపాటు 25 మంది చొప్పున పంచాయతీ కార్యదర్శులను ఎంపిక చేసి శిక్షణా ఇస్తున్నారు. ఈ నెల 13వ తేదీలోగా ట్రైనర్స్కు శిక్షణ పూర్తికానుంది. ఆ తర్వాత ట్రైనర్లు రాష్ట్రంలోని 12769 మంది సర్పంచ్లు, వార్డు మెంబర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. మార్చి 31లోపు (TG) రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల పాలకవర్గాలకు జిల్లా కేంద్రాల్లో పూరిసాయిలో శికణ కొనసాగనుంది.