📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్

TG: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఉపాధి హామీలో మార్పులు

Author Icon By Rajitha
Updated: December 26, 2025 • 2:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

TG: ఉపాధి హామీ పథకం అమలులో జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ (TG) ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. ఇకపై ఉపాధి పనులు పూర్తయిన తర్వాత ఖజానా (ట్రెజరీ) శాఖ ఆమోదం పొందిన అనంతరమే నిధులు విడుదల చేయనుంది. ఈ కొత్త విధానం వచ్చే ఏడాది జనవరి నుంచి అమల్లోకి రానుంది. దీని ద్వారా నిధుల వినియోగంలో పారదర్శకత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

Read alo: Telangana: ఎట్టకేలకు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకి బెయిల్

hanges in the employment guarantee scheme.

‘ఎస్‌ఎన్‌ఏ స్పార్ష్‌’ మాడ్యూల్‌లో

కొత్త విధానం ప్రకారం గ్రామస్థాయిలో చేపట్టే ఉపాధి పనుల వివరాలను ‘ఎస్‌ఎన్‌ఏ స్పార్ష్‌’ మాడ్యూల్‌లో నమోదు చేయాలి. కూలీల పనివివరాలు, ఉపయోగించిన సామగ్రి రికార్డులను ట్రెజరీ శాఖకు సమర్పించాల్సి ఉంటుంది. ట్రెజరీ ఆమోదం వచ్చిన తర్వాతే ఈ వివరాలను పీఎఫ్‌ఎంఎస్‌ఎస్‌కు పంపించి, పరిశీలన పూర్తైన అనంతరం నిధులు విడుదల చేస్తారు. అటవీ శాఖ, ఐటీడీఏ, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ శాఖల ఆధ్వర్యంలో జరిగే పనులన్నింటికీ ఈ నిబంధన వర్తిస్తుంది.

ఇప్పటివరకు నేరుగా ఐఎఫ్‌ఎంఐఎస్‌ పోర్టల్ ద్వారా నిధులు విడుదల చేయడంతో అక్రమాలు చోటు చేసుకున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అందుకే ఈ కొత్త మార్పులు తీసుకొచ్చింది. అలాగే ఇకపై రాష్ట్ర ప్రభుత్వం తన వాటా బిల్లులకు ఆమోదం ఇచ్చిన తర్వాతే కేంద్రం నిధులు విడుదల చేసేలా మార్పులు చేశారు. దీంతో ఉపాధి హామీ పనుల్లో జాప్యం తగ్గి, నిధుల వినియోగం సక్రమంగా జరుగుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

EmploymentScheme latest news MGNREGA TelanganaGovernment Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.