తెలంగాణ (TG) రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. పట్టణ ప్రాంతాలలోని మౌలిక వసతులను బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన పౌర సేవలను అందించేందుకు భారీ స్థాయిలో నిధులను విడుదల చేసింది. రేవంత్ రెడ్డి సర్కార్ రూ. 2,780 కోట్లను మున్సిపల్ సంస్థల అభివృద్ధి కోసం కేటాయించడం రాష్ట్రం (TG)లో చర్చనీయాంశమైంది.
BRS: ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ బాకీ కార్డును ఆవిష్కరించిన హరీష్ రావు
ఈ నిధులతో మొత్తం 2,432 అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. వీటిలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, స్ట్రీట్ లైట్స్, తాగునీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలు ప్రధాన ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన ఈ ఆర్థిక సాయం పట్టణ ప్రాంతాల్లో ప్రజల జీవిత ప్రమాణాలను మెరుగుపరచడమే ముఖ్య లక్ష్యంగా ఉంది.
ఈ నిధుల కేటాయింపులో ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు, అలాగే విలీన గ్రామాలు కలిగిన ప్రాంతాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చింది. ముఖ్యంగా వేగంగా పట్టణీకరణ జరుగుతున్న ప్రాంతాల్లో అభివృద్ధి పనులు అత్యవసరం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
నిధుల కేటాయింపులో ప్రాధాన్యత
ఈ నిధుల కేటాయింపులో ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు, అలాగే విలీన గ్రామాలు కలిగిన ప్రాంతాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చింది. ముఖ్యంగా వేగంగా పట్టణీకరణ జరుగుతున్న ప్రాంతాల్లో అభివృద్ధి పనులు అత్యవసరం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
కొత్త మున్సిపాలిటీలు రూ. 15 కోట్లు
విలీన గ్రామాలతో ఉన్న మున్సిపాలిటీలు రూ. 20 కోట్లు
పాత మున్సిపాలిటీలు రూ. 15 కోట్లు
కొత్త కార్పొరేషన్లు రూ. 30 కోట్లు
2026 మార్చి నాటికి పూర్తి చేయాలని గడువు
తెలంగాణ రైజింగ్ విజన్ 2027లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ (Greater Hyderabad) కు బయట ఉన్న పట్టణాలు, గ్రోత్ హబ్లుగా మార్చడానికి ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మక ప్రణాళికను రూపొందించింది. ఈ ప్రాంతాల్లో వేగవంతమైన పట్టణీకరణ, పెరుగుతున్న జనాభా డిమాండ్లను దృష్టిలో ఉంచుకుని పనులను చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
నిధులను తక్షణమే విడుదల చేయాలని, ఆలస్యం లేకుండా టెండర్ ప్రక్రియను ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. అయితే ఈ నిధుల కేటాయింపు నుంచి గ్రేటర్ హైదరాబాద్ (GHMC) కోర్ అర్బన్ సిటీని మినహాయించారు. ఈ పనులన్నింటినీ 2026 మార్చి నాటికి పూర్తి చేయాలని గడువు విధించారు.
మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించనున్నారు
విడుదలైన నిధులను పట్టణ ప్రాంతాల్లోని కీలక మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించనున్నారు. వాటిలో ప్రధానంగా..పట్టణాల్లో రోడ్ల నిర్మాణం,డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదలపార్కులు, కల్వర్టుల నిర్మాణం,డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రాంతాల్లో నివసించేవారికి ప్రాథమిక సదుపాయాలఏర్పాటుకు ,నిధులు కేటాయించారు.
మున్సిపల్ శాఖ ఈ నిధుల వినియోగానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రాధాన్యత క్రమంలో రూపొందిస్తోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్టణ ప్రాంతాల అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడానికి దోహదపడుతుందని ఆశిస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: