📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

TG: కౌలు రైతుకు అండగా రైతు కమిషన్

Author Icon By Saritha
Updated: February 6, 2026 • 11:08 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి ఆర్థిక సాయం

హైదరాబాద్ : సాగు కోసం చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్న ఓ కౌలు రైతు కుటుంబానికి (TG) తెలంగాణ రైతు సంక్షేమ కమిషన్ అండగా నిలిచింది. ములుగు జిల్లాలో(Mulugu district) ఆత్మహత్య చేసుకున్న గిరిజన కౌలు రైతు కుటుంబానికి కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి చేతుల మీదు గా కమిషన్ సభ్యుడు భూమి సునీల్ రూ.25 వేల ఆర్థిక సాయం చేశారు. ఈ మేరకు గురువారం తార్నకలోని లీఫ్స్ కార్యాలయంలో ఈ కార్యక్రమానికి హాజరైన కమిషన్ సభ్యులు కేవీఎన్రెడ్డి, రాములునాయక్, గోపాల్ రెడ్డి ఆ కుటుంబానికి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని అదనంగా మరో రూ.15 వేల ఆర్ధిక సాయమందించారు. కమిషన్ సభ్యురాలు భవానిరెడ్డి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

Read Also: Telangana: నేడు బీజేపీ మేనిఫెస్టో రిలీజ్

ఆ కుటుంబానికి ఆత్మ స్థైర్యంగా ఉంటూ వారి కుటుంబంలోని పిల్లల్ని బాగా చదివించాలని, అందుకు తగ్గ సాయ మందిస్తామని పేర్కొన్నారు. (TG) ములుగు జిల్లా దేవగిరిపట్నంకు చెందిన గిరిజన రైతు నాగవతరాజు(40) ఎనిమిది ఎకరాల భూమి ని కౌలు తీసుకుని పత్తి, వరి సాగు చేశాడు. వరు సగా మూడేళ్లు పంట నష్టం రావటంతో రూ.5లక్షల వరకు అప్పులు అయ్యాయి.

అప్పుల ఒత్తిడిని తట్టుకోలేక 2020 జనవరి 23న పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందాడు. భార్య లావణ్య కూలీ పనులు, కుట్టు మిషన్తో పోషిస్తోంది. పెద్ద కుమార్తె తేజశ్రీ మానసిక దివ్యాంగురాలు కాగా చిన్న కుమార్తె అంజలి, కుమారుడు జస్వంత్, అర్థ ఉన్నారు. కాగా.. కమి షన్ సభ్యుడు భూమి సునీల్ తన తండ్రి మేక సంజీవరెడ్డి ద్వితీయ వర్ధంతిని రైతు కుటుం బాల ను ఆదుకునే కార్యక్రమంగా మార్చారు. తండ్రి జ్ఞాపకార్థం ప్రతియేటా ఒక రైతు కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Farmer farmer suicide farmer welfare hyderabad Latest News in Telugu Mulugu District Telangana Telugu News Tenant Farmer Tribal Farmer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.