TG: తెలంగాణ సర్వపిండి, సకినాలు, (sakinalu) బెల్లం మిఠాయిలకు ఇప్పుడు దేశ విదేశాల మార్కెట్లలో గుర్తింపు దక్కే దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. మేడ్చల్ జిల్లా మహిళా స్వయం సహాయక సంఘాలు తయారు చేస్తున్న సాంప్రదాయ వంటకాలను ప్రత్యేక బ్రాండ్గా మార్చేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులుప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నారు. నాణ్యతా నియంత్రణ నుంచి ఆన్లైన్ అమ్మకాల దాకా పూర్తి వ్యవస్థను సిద్ధం చేస్తూ, గ్రామీణ మహిళల ఉత్పత్తులను గ్లోబల్ మార్కెట్కు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారు.
Read also: Karimnagar: 6 లక్షలకు బిడ్డ విక్రయం సంచలనం

Telangana Sarvapindi, Sakinalu.. now in the online market
చిరుధాన్యాలతో ఆరోగ్యకరమైన స్నాక్స్ కూడా
మేడ్చల్ జిల్లాలో 3,500 కంటే ఎక్కువ మహిళా సంఘాల్లో దాదాపు 38 వేలకుపైగా సభ్యులు ఉన్నారు. వీరిలో చాలా మంది ఇంటి వద్దే సర్వపిండి, సకినాలు, బూందీ, లడ్డూల్, కజ్జికాయలు, గవ్వలు వంటి స్వీట్లు పూర్తిగా బెల్లంతో తయారు చేస్తున్నారు. అదేవిధంగా రాగి, జొన్న, కొర్ర వంటి చిరుధాన్యాలతో ఆరోగ్యకరమైన స్నాక్స్ కూడా చేస్తున్నారు. పట్టణాల్లో పెరుగుతున్న హెల్త్ కాన్షియస్ డిమాండ్ కారణంగా ఈ ఉత్పత్తులకు మంచి మార్కెట్ ఏర్పడుతోంది.
TG: ఉత్పత్తులను జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు SHG సభ్యులకు నైపుణ్య శిక్షణ, శుభ్రత ప్రమాణాలు, ఆధునిక తయారీ పద్ధతులపై అవగాహన కల్పించారు. కేరళ కుదుంబశ్రీ, హైదరాబాద్ నిథమ్ సంస్థలను సందర్శించేలా ఏర్పాట్లు చేసి అత్యాధునిక యంత్రాలతో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ ఎలా తయారు చేయాలో నేర్పించారు. ప్రస్తుతం వీరు తమ ఉత్పత్తులకు FSSAI ధ్రువీకరణను పొందుతూ విక్రయిస్తున్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :