ఇటీవల తెలంగాణలో సైబర్ నేరగాళ్ల కొత్త పద్ధతులు గణనీయంగా పెరిగాయి. సామాన్యుల నుండి ప్రజా ప్రతినిధులు, మంత్రి విభాగాల ఉద్యోగుల వరకు ఎవరూ వీరి దాడి నుంచి రక్షణలో లేరు. వీరు ఇప్పటికే వాట్సాప్,(WhatsApp) మొబైల్ ఫోన్లలో ఉన్న సమాచారాన్ని హ్యాక్ చేయడం ప్రారంభించారు.
తాజాగా ఏపీకే ఫైల్స్ (TG) పేరుతో ఒక ఫేక్ SBI లింక్ చాలా మంది వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయబడింది. ఈ సందేశాల్లో మీ బ్యాంక్ ఖాతా బ్లాక్ అవుతుంది వెంటనే లింక్ క్లిక్ చేసి KYC వివరాలు అప్డేట్ చేయండి అని అందరినీ మోసగించేందుకు ప్రయత్నించారు. కొందరు వినియోగదారులు భయపడుతూ లింక్ను క్లిక్ చేసిన ఫలితంగా వారి ఫోన్లు హ్యాక్ అయ్యాయి. తర్వాత ఆ ఫోన్లోని గ్రూప్లకు ఆ ఫేక్ మెసేజ్ వ్యాప్తి చెందింది, వలంలా వేలాది ఫోన్లకు చేరింది. హ్యాక్ కేసుల వల్ల రాష్ట్రంలోని మంత్రిత్వ శాఖలు, మీడియా ప్రతినిధుల గ్రూపులు, విద్యార్థుల గ్రూపులు కూడా ప్రభావితమయ్యాయి. పలువురు స్థానిక పోలీసులతో పాటు 1930కి కూడా ఫిర్యాదు చేస్తున్నారు.
Read also: కొత్త కార్మిక చట్టాలు .. తగ్గనున్న జీతం?

తక్షణ జాగ్రత్తలు:
- ఏపీకే ఫైల్ లేదా అనుమానాస్పద యాప్ ఇన్స్టాల్ చేసి ఉంటే వెంటనే ఇంటర్నెట్ ఆఫ్ చేసి యాప్ను అన్ఇన్స్టాల్ చేయాలి.
- యాంటీవైరస్ అప్లికేషన్ ఉపయోగించి ఫోన్ ఫుల్ స్కాన్ చేయాలి.
- బ్యాంకింగ్, సోషల్ మీడియా, ఇ-మెయిల్ పాస్వర్డ్లు వెంటనే మార్చాలి.
- కాల్ లాగ్, మెసేజ్లు, బ్యాంక్ లావాదేవీలలో అనుమానాస్పద యాక్టివిటీ ఉన్నదో పరిశీలించాలి.
- మాల్వేర్ యాప్ సరిగ్గా అన్ఇన్స్టాల్ కాకపోతే, ఫోన్ను సేఫ్ మోడ్లో రీస్టార్ట్ చేసి యాప్ను తొలగించాలి.
- ఇంకా సమస్య ఉంటే డేటా బ్యాకప్ తీసుకుని ఫ్యాక్టరీ రీసెట్ చేయడం మంచిది.
- ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు ఉంటే వెంటనే బ్యాంక్ను సంప్రదించి ఖాతాను స్తంభింపచేయాలి.
- ఫిర్యాదు కోసం 1930 నంబర్లో కాల్ చేయాలి.
సైబర్ క్రైమ్ పోలీసులు(TG) ఈ ఏపీకే ఫైల్స్ను ఓపెన్ చేయకూడదని, లింకులపై క్లిక్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు హెచ్చరిస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: