📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ ఈరోజు బంగారం ధరలు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ USలో మంచు తుఫాన్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ ఈరోజు బంగారం ధరలు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ USలో మంచు తుఫాన్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్

TG: సిట్ విచారణకు హాజరైన సంతోష్ రావు

Author Icon By Saritha
Updated: January 27, 2026 • 3:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణలో (TG) సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో విచారణకు రావాలని బీఆర్ఎస్ (BRS) మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావు (Santosh Rao) కు సిట్ నోటీసులు జారీ చేసింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు తమ ఎదుట హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. సిట్ నోటీసులపై సంతోష్ రావు స్పందించారు. రేపటి సిట్ విచారణకు హాజరవుతానని, పోలీసులు అడిగే ప్రశ్నలకు సమాధానమిస్తానని సంతోష్ రావు తెలిపారు.

ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా బీఆర్ఎస్ మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌లను సిట్‌ విచారించిన విషయం తెలిసిందే.ఇప్పుడు కేసీఆర్ కుటుంబానికే చెందిన సంతోష్ రావును కూడా విచారణకు పిలవడంతో తదుపరి వంతు ఎవరిదన్న అంశం హాట్ టాపిక్ గా మారింది.

Read Also: Phone Tapping: మరో రెండు రోజుల్లో కవితకు సిట్ నోటీసులు?

(TG) బీఆర్ఎస్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావు మంగళవారం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎదుట విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్‌లోని ఏసీపీ కార్యాలయంలో అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు.

సంతోష్ రావుకు నిన్న సిట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఈరోజు మూడు గంటలకు విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఇటీవలే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావులను ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు విచారించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

brs BRS leader Latest News in Telugu Phone Tapping Case Santosh Rao SIT investigatio Telangana Telangana politics Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.