హైదరాబాద్: తెలంగాణ(TG) వ్యాప్తంగా రైస్ మిల్లర్లు(Rice millers) కస్టమ్ మిల్లింగ్ ధాన్యం (సీఎంఆర్)ను తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా నల్లబజారుకు తరలిస్తుండటంతో, ప్రభుత్వం అక్రమ దందాను కట్టడి చేసేందుకు విజిలెన్స్ తనిఖీల తీవ్రతను పెంచింది. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఆర్సీపురం అధికారులు పుల్కల్ మండలం ముదిమానిక్యం గ్రామంలోని విజయదుర్గ ఆగ్రోస్ ఇండస్ట్రీలో ఆదివారం తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో 2024-25 రబీ సీజన్కు చెందిన రూ.1.28 కోట్ల విలువగల ధాన్యాన్ని రైస్ మిల్లర్ చీకటిబజారుకు తరలించినట్లు అధికారులు గుర్తించారు.
Read Also: Trump Tariffs : భారత్ పై టారిఫ్లు తగ్గిస్తాం – ట్రంప్ ప్రకటన
రైస్ మిల్లర్ల అక్రమాలు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నష్టాలు
రబీ సీజన్లో మిల్లింగ్ చేసి ఇవ్వాల్సిన 5,537 క్వింటాళ్ల ధాన్యం (సుమారు 13,842 గోనెసంచులు) రైస్ మిల్లులో లెక్కించగా తక్కువ వచ్చాయి. సదరు రైస్ మిల్లర్ను ప్రశ్నించినప్పటికీ, ఆయన సరైన సమాధానం ఇవ్వలేదు. రైస్ మిల్లర్లు తెలంగాణలో దశాబ్దాలుగా సీఎంఆర్ బియ్యం అప్పగింతలో అనేక అక్రమ పద్ధతులు ఆచరిస్తుండటంతో, సివిల్ సప్లై కార్పొరేషన్ నానాటికి అప్పుల్లో కూరుకుపోతోంది. ప్రస్తుతం ఈ సంస్థకు రూ.59 వేల కోట్ల అప్పులు, రూ.11 వేల కోట్ల నష్టంతో కూనారిల్లుతోంది. సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గత రెండు సంవత్సరాలుగా సీఎంఆర్ వ్యవస్థను చక్కబరచాలని ప్రయత్నిస్తున్నప్పటికీ, సిబ్బంది, రైస్ మిల్లర్లు మాత్రం కోట్లకు పడగలెత్తుతున్నారు.
సీఎంఆర్ ధాన్యం(grain) ఇవ్వడానికి ప్రభుత్వం ఇటీవల బ్యాంకు గ్యారంటీ విధానాన్ని కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది. సీఎంఆర్ బియ్యం ఎగవేతకు పాల్పడే రైస్ మిల్లర్లు, లీజుకు రైస్ మిల్లు తీసుకునే వ్యాపారులు 25 శాతం బ్యాంక్ పూచీకత్తు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, రా లేదా బాయిల్డ్ రైస్ మిల్లర్లు ఎవరూ కూడా బ్యాంక్ గ్యారంటీ ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. విజిలెన్స్ దాడులు చేసినా వారిలో భయం భక్తి లేకపోవడం, ‘టేక్ ఇట్ ఈజీ’ ధోరణితో వ్యవహరిస్తుండటం గమనార్హం.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: