📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్

TG: విశ్రాంత ఉద్యోగుల చలో అసెంబ్లీ ఉద్రిక్తం.. అరెస్టులు

Author Icon By Saritha
Updated: January 6, 2026 • 10:49 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : (TG) ఏడాదిన్నరగా ఆపరిష్కతంగా వున్న తమ డిమాండల్ల సాధనకు విశ్రాంత ఉద్యోగులు చేపట్టిన ఛలో అసెంబ్లీ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన విశ్రాంత ఉద్యోగులు తమకు ప్రభుత్వం (Government) నుంచి రావలసిన బకాయిల కోసం కదం తొక్కారు. పెద్ద సంఖ్యలో విశ్రాంత ఉద్యోగులు నాంపల్లి, బషీర్ బాగ్ నుంచి అసెంబ్లీ వైపుకు వచ్చెందుకు యత్పంచగా పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆందోళనకారులను పోలీసులు బలవతంగా పోలీసు వాహనాల్లో ఎక్కించారు.

Read also: Jogu Ramanna arrest : రైతుల కోసం నిరసన, తెల్లవారుజామున మాజీ మంత్రి జోగు రామన్న అరెస్ట్

బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్

తమను అరెస్టు చేస్తున్న(TG) సమయంలో విశ్రాంత ఉద్యోగులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. తమ అరెస్టు అన్యాయమని, సర్కారు తమ ను మోసం చేసిందని వాపోయారు. 30 నుంచి 40 ఏళ్ల పాటు ప్రభుత్వంలో వివిధ విభాగాల్లో పనిచేసిన వారు పదవీ విరమణ చేశాక న్యాయం ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను ఇచ్చేందుకు సర్కారు నిరాకరణ దారుణమని తెలిపారు. ఏడాదిన్నరగా దీనిపై అనేక రూపాలో పోరాటం ప్రభుత్వంలో చేసినా చలనం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అసెంబ్లీని ముట్టడించాలని నిర్ణయించినట్లు వారు తెలిపారు.

అనేక మంది విశ్రాంత ఉద్యోగులు అనారోగ్యం పాలైతే వైద్యం చేయించుకునేందుకు డబ్బులు లేక నానా అవస్థలు పడుతున్నారని, ఇందులో కొందరు చనిపోయారని ఆయన తెలిపారు. ప్రభుత్వం తన మొండి వైఖరిని ఇప్పటికైనా విడనాడి, తమకు రావాలసిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల విషయంలో సర్కారు ఇదే విధం గా నిర్లక్ష్యం కొనసాగిస్తే పోరాటాన్ని మరింత ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఆందోళనకారులను పలు పోలీసు స్టేషన్లకు తరలించి రాత్రి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Assembly Protest Chalo Assembly government dues hyderabad Latest News in Telugu retired employees Telangana Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.