📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

News Telugu: TG: రిజర్వేషన్ల తగ్గింపు, ప్రజాధనం దుర్వినియోగం: కేటీఆర్

Author Icon By Rajitha
Updated: November 26, 2025 • 5:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేటీఆర్ (KTR) తీవ్రంగా విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్, చివరకు వాటిని 17 శాతానికి తగ్గించిందని ఆయన ఆరోపించారు. రిజర్వేషన్ల కోతపై రాహుల్ గాంధీ స్పష్టమైన సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని కేటీఆర్ అన్నారు. కులగణనను ఆదర్శంగా చెబుతూ, అమల్లో మాత్రం వెనక్కి తగ్గటం ప్రజలను మోసం చేయడమేనని వ్యాఖ్యానించారు.

 Read also: Gram Panchayat elections: కోడ్ కూసింది.. అమల్లోకి ఎలక్షన్ రూల్స్

Reduction of reservations, misuse of public money

టెక్స్‌టైల్ హబ్‌గా

వరంగల్ పర్యటన సందర్భంగా మాట్లాడుతూ, ఈ జిల్లాకు పత్తి పంట, అజంజాహీ మిల్లుల వల్ల ఉన్న ప్రత్యేకతను గుర్తుచేసిన కేటీఆర్, కేసీఆర్ హయాంలో ఏర్పాటైన టెక్స్‌టైల్ పార్క్ వరంగల్‌కు మళ్లీ గుర్తింపు తెచ్చిందని చెప్పారు. టెక్స్‌టైల్ హబ్‌గా జిల్లాకు కొత్త అవకాశాలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ మాత్రం అభివృద్ధి పేరుతో ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్‌ను రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు వేదికగా మార్చిందని ఆయన ఆరోపించారు.

తెలంగాణను ఆర్థిక వనరుల కేంద్రంగా

9300 ఎకరాల పారిశ్రామిక భూములను విక్రయించి తెలంగాణను ఆర్థిక వనరుల కేంద్రంగా ఉపయోగించాలన్న ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్తోందని కేటీఆర్ విమర్శించారు. ఫార్మా సిటీ ఏర్పాటు ద్వారా కాలుష్య పరిశ్రమలను నగర0 బయటికి తరలించినదీ తమ ప్రభుత్వమేనని ఆయన గుర్తుచేశారు. ఇక రేవంత్ రెడ్డి పాలనలో భారీ భూకుంభకోణాలు జరుగుతున్నాయని ఆరోపించి, బీఆర్ఎస్ దీనిపై జోరుగా పోరాడుతుందని స్పష్టం చేశారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

BC Reservations congress ktr Rahul Gandhi Latest News Telangana Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.