📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్

News Telugu: TG Pre School: వారందరికీ 200 రోజుల పాటు ఫ్రీగా పాలు

Author Icon By Rajitha
Updated: November 18, 2025 • 3:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ (Telangana) ప్రభుత్వం పౌష్టికాహార లోపాన్ని తగ్గించేందుకు మరో ముఖ్యమైన సంక్షేమ కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలోని ప్రీ స్కూల్ పిల్లలకు ఏడాదిలో 200 రోజుల పాటు ఉచితంగా పాలు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ముందుగా ములుగు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని పైలట్‌గా ప్రారంభించి, ఫలితాలు సానుకూలంగా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ములుగులో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి సీతక్క స్వయంగా పాల పంపిణీని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, చిన్నారుల ఆరోగ్యం, పోషకాహార వృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే పలు సూచనలు ఇచ్చినట్లు ఆమె వివరించారు.

Read also: iBOMMA: రవి అరెస్టుపై DCP కవిత కీలక వివరణ

TG Pre School Free milk for 200 days

3 నుంచి 6 సంవత్సరాల మధ్య వయస్సు

ఈ కొత్త పథకం ప్రకారం, 3 నుంచి 6 సంవత్సరాల మధ్య వయస్సు గల చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రతిరోజూ 100 మి.లీ విజయా డెయిరీ పాలు అందించబడతాయి. స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఈ మేరకు అధికారిక ఆదేశాలు జారీ చేసింది. అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేసే యూహెచ్‌టీ టెట్రా ప్యాకుల పాలను వేడి చేసి, అవసరమైతే పంచదార లేదా బెల్లం కలిపి పిల్లలకు ఇవ్వాలని సూచించారు. పైలట్ ప్రాజెక్ట్ అమలు సందర్భంగా, క్షేత్రస్థాయి ఉద్యోగులు మరియు పిల్లల తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలను సేకరించాలని శాఖ ఆదేశించింది. కార్యక్రమం సక్సెస్ అవుతుందనే నమ్మకం వ్యక్తం చేస్తూ, అంగన్వాడీ టీచర్లు పిల్లలకు మరింత ప్రేమతో సేవ చేయాలని మంత్రి సీతక్క కోరారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Child Welfare free milk latest news Telangana Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.