తెలంగాణ (Telangana) ప్రభుత్వం పౌష్టికాహార లోపాన్ని తగ్గించేందుకు మరో ముఖ్యమైన సంక్షేమ కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలోని ప్రీ స్కూల్ పిల్లలకు ఏడాదిలో 200 రోజుల పాటు ఉచితంగా పాలు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ముందుగా ములుగు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని పైలట్గా ప్రారంభించి, ఫలితాలు సానుకూలంగా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ములుగులో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి సీతక్క స్వయంగా పాల పంపిణీని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, చిన్నారుల ఆరోగ్యం, పోషకాహార వృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే పలు సూచనలు ఇచ్చినట్లు ఆమె వివరించారు.
Read also: iBOMMA: రవి అరెస్టుపై DCP కవిత కీలక వివరణ

TG Pre School Free milk for 200 days
3 నుంచి 6 సంవత్సరాల మధ్య వయస్సు
ఈ కొత్త పథకం ప్రకారం, 3 నుంచి 6 సంవత్సరాల మధ్య వయస్సు గల చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రతిరోజూ 100 మి.లీ విజయా డెయిరీ పాలు అందించబడతాయి. స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఈ మేరకు అధికారిక ఆదేశాలు జారీ చేసింది. అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేసే యూహెచ్టీ టెట్రా ప్యాకుల పాలను వేడి చేసి, అవసరమైతే పంచదార లేదా బెల్లం కలిపి పిల్లలకు ఇవ్వాలని సూచించారు. పైలట్ ప్రాజెక్ట్ అమలు సందర్భంగా, క్షేత్రస్థాయి ఉద్యోగులు మరియు పిల్లల తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలను సేకరించాలని శాఖ ఆదేశించింది. కార్యక్రమం సక్సెస్ అవుతుందనే నమ్మకం వ్యక్తం చేస్తూ, అంగన్వాడీ టీచర్లు పిల్లలకు మరింత ప్రేమతో సేవ చేయాలని మంత్రి సీతక్క కోరారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: